Start-Up: భారత్లో టాప్-25 స్టార్టప్లు ఇవే..
ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్ ఏటా విడుదల చేసే 25 అత్యుత్తమ అంకుర సంస్థల జాబితాలో ఏకీకృత చెల్లింపు వేదిక క్రెడ్ అగ్రస్థానంలో నిలిచింది....
బెంగళూరు: ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్ ఏటా విడుదల చేసే 25 అత్యుత్తమ అంకుర సంస్థల జాబితాలో ఏకీకృత చెల్లింపు వేదిక క్రెడ్ అగ్రస్థానంలో నిలిచింది. 6.4 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ సంస్థ 2021లో మూడో స్థానంలో నిలవగా ఈసారి తొలిస్థానానికి చేరింది. వినూత్న ప్రకటనలతో విశేష ఆదరణ పొందిన క్రెడ్.. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టినట్లు లింక్డిన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ జాబితాలో అప్గ్రాడ్ రెండోస్థానంలో ఉంది. దేశంలో ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఉన్నత విద్యను అందిస్తున్న అగ్రగామి సంస్థగా ఇది కొనసాగుతోంది. ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తోందని లింక్డిన్ తెలిపింది. తర్వాతి స్థానంలో ఆన్లైన్ పెట్టుబడుల వేదిక గ్రో నిలిచింది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో ఉన్న అవకాశాలను సమీక్షించే ఈ కంపెనీ వాటిని మదుపర్లకు చేరువ చేస్తోంది.
ఈ జాబితాలో ఈసారి పలు కొత్త సంస్థలు కూడా స్థానం దక్కించుకున్నాయి. వీటిలో ఇ-గ్రోసరీ కంపెనీ జిప్టో (4వ స్థానం), పాత కార్ల విక్రయ వేదిక స్పిన్నీ (7వ స్థానం), బీమాటెక్ అంకుర సంస్థ డిట్టో ఇన్సూరెన్స్ (12వ స్థానం) ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్ వేదికగా ప్రజలకు ఆర్థిక, ప్రయాణ, నిత్యావసర సేవల్ని చేరువ చేస్తున్న కంపెనీలు. ఫిట్నెస్ ప్లాట్ఫామ్ అల్ట్రాహ్యూమన్ 19వ స్థానం, ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ప్లేస్ లివింగ్ ఫుడ్ 20వ స్థానంలో చేరింది.
ఈ జాబితాలోని 25 కంపెనీల్లో 13 బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నవే. దీంతో ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఈ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తాజా టాప్-10 అంకురాల్లో 68 శాతం కొత్త కంపెనీలే ఉండడం విశేషం. ఇది భారత్లో అంకుర సంస్థలకు కావాల్సిన వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో సూచిస్తోందని లింక్డిన్ న్యూస్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరజిత బెనర్జీ పేర్కొన్నారు. వాణిజ్య కార్యకలాపాల్లో నెలకొన్న అనిశ్చిత వాతావరణాన్ని అధిగమించడానికి ఈ స్టార్టప్లు తమ వ్యాపారాలను తదనుగుణంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. అలాగే ఈ అంకురాలు యువ ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ 25 కంపెనీలు ఇటీవల నియమించుకున్న ఉద్యోగుల్లో 56 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారేనని తెలిపారు. 17 శాతం మంది వయసు 25 ఏళ్ల లోపేనన్నారు.
ఈ జాబితాలో ఉన్న కంపెనీలు ర్యాంకుల వారీగా.. క్రెడ్, అప్గ్రాడ్, గ్రో, జిప్టో, స్కైరూట్ ఏరోస్పేస్, ఎంబీఏ ఛాయ్వాలా, స్పిన్నీ, ది గుడ్ గ్లామ్ గ్రూప్, గ్రోత్స్కూల్, బ్ల్యూస్మార్ట్, షేర్చాట్, డిట్టో ఇన్సూరెన్స్, సింపుల్, ర్యాపిడో, క్లాస్ప్లస్, పార్క్+, బ్లిస్క్లబ్, డీల్షేర్, అల్ట్రాహ్యూమన్, లివింగ్ ఫుడ్, ఫ్యామ్పే, అగ్నికూల్ కాస్మోస్, స్టాంజా లివింగ్, పాకెట్ ఎఫ్ఎం, జిప్ ఎలక్ట్రిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు