Credit card: క్రెడిట్ కార్డుల కొనుగోళ్లు రూ.లక్ష కోట్లపైనే.. ఇ-కామర్స్దే మెజారిటీ వాటా!
Credit card spends: దేశంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించి చేసే ఖర్చు వరుసగా 11వ నెలా రూ.1లక్ష కోట్లు దాటింది. జనవరిలో 1.28 లక్షలుగా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో క్రెడిట్ కార్డుల (Credit cards) వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చు సింపుల్గా నెలకు రూ.1 లక్ష కోట్లు దాటేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈ విలువ ఏకంగా రూ.1.28 లక్షల కోట్లుగా నమోదైంది. రూ.లక్ష కోట్లు పైబడి కొనుగోళ్లు నమోదు కావడం వరుసగా ఇది 11వ నెల కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్బీఐ (RBI) తాజాగా డేటా విడుదల చేసింది.
2022 అక్టోబర్లో పండగ సీజన్ సమయంలో దేశంలో అత్యధికంగా రూ.1.29 లక్షల కోట్ల మేర క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేశారు. డిసెంబర్లో ఆ విలువ రూ.1.26 లక్షలుగా నమోదైంది. జనవరిలో ఈ మొత్తం 1 శాతం పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది. జనవరి నెలలో జరిగిన మొత్తం ఖర్చులో ఇ-కామర్స్ వాటానే 61 శాతంగా ఉందని ఆర్బీఐ తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద 38 శాతం జరగ్గా.. మిగిలిన వాటా ఇతర రూపాల్లో జరిగిందని పేర్కొంది. మొత్తం ఖర్చులో ఎక్కువ ట్రావెల్, టూరిజం, షాపింగ్కు సంబంధించినవే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చుల విషయంలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వృద్ధిని నమోదు చేయగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం 1.3 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే, మార్కెట్ వాటా పరంగా మాత్రం ఆ బ్యాంక్దే పైచేయి. మొత్తం ఖర్చులో హెచ్డీఎఫ్ బ్యాంక్ 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. 19 శాతం వాటాతో ఎస్బీఐ రెండో స్థానంలో నిలిచింది. ఇక కొత్త కార్డుల విషయానికొస్తే.. జనవరిలో 12.6 లక్షల కొత్త కార్డులు జారీ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కార్డుల సంఖ్య 8.2 కోట్లకు చేరింది. ఇందులో ఎస్బీఐ అత్యధికంగా 3.3 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేయగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.2 లక్షలు, యాక్సిస్ 1.4 లక్షలు, ఐసీఐసీఐ 1.3 లక్షల కార్డులను జారీ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..