త్వరలో క్రిప్టోకరెన్సీపై బిల్లు

త్వరలోనే క్రిప్టోకరెన్సీపై బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో

Published : 09 Feb 2021 19:34 IST

రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి

దిల్లీ: త్వరలోనే క్రిప్టోకరెన్సీపై బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. క్రిప్టో కరెన్సీ బిల్లు చివరి దశలో ఉందని ఆయన వెల్లడించారు. ‘‘భారత్‌లో క్రిప్టో కరెన్సీ వినియోగంపై ఆర్బీఐ త్వరలో విధివిధానాలు త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. కానీ అది సమస్యాత్మకమైన అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో నిలువరించేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును పెట్టే ప్రతిపాదన ఉందా?.’’ అని కర్ణాటక భాజపా ఎంపీ కేసీ రామమూర్తి అడిగారు. దీనికి ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ సమాధానమిచ్చారు. ‘‘ఆర్బీఐ, సెబీలకు క్రిప్టోకరెన్సీని  నేరుగా నియంత్రించేందుకు లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ లేదు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, వస్తువు కాదు. ప్రస్తుతమున్న చట్టాల్లో దీనికి సంబంధించిన అంశాలు లేవు. అందుకే గతంలో దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. దీనిపై బిల్లు చివరిదశలో ఉంది. త్వరలో కేబినెట్‌ ముందుకు తెస్తాం.’’ అని మంత్రి తెలిపారు.

దేశంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడంపై విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని భారతీయ రిజర్వు బ్యాంకు గతంలో వెల్లడించింది. దేశంలో క్రమంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ పెరుగుతుండటంతో, వీటి వల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇవీ చదవండి..

భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ

ఉద్యమ కేంద్రంలోనే ఉపద్రవం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని