Facebook: ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంఖ్యలో తొలిసారి పతనం

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఆ సంస్థ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గింది.  ఈ సంఖ్య డిసెంబర్‌తో

Updated : 03 Feb 2022 14:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఆ సంస్థ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గింది.  డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ సంఖ్య 1.929 బిలియన్లకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 1.930 బిలియన్లుగా ఉంది. దీంతోపాటు ప్రత్యర్థి సంస్థలైన టిక్‌టాక్‌, యూట్యూబ్‌ నుంచి పోటీ పెరిగిపోవడంతో ఆదాయాలు తగ్గుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 

ఫలితంగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా షేర్లు ట్రేడింగ్‌ ఆఫ్టర్ అవర్స్‌లో 20శాతం మేరకు కుంగాయి. దీంతో ఫేస్‌బుక్‌ మార్కెట్‌ విలువలో ఏకంగా 200 బిలియన్‌ డాలర్ల పతనం చోటు చేసుకొంది. మరోపక్క ట్విటర్‌, పిన్‌ట్రస్ట్‌, స్నాప్‌ షేర్లు కూడా పతనం అయ్యాయి. 

వినియోగదారుల సంఖ్యలో తగ్గుదలపై మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ముఖ్యంగా యువ వినియోగదారులు ఫేస్‌బుక్‌ను వీడి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లిపోతుండటంతో సంస్థ వ్యాపారం తగ్గుతోందని వెల్లడించారు. ఇప్పటికే యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో మార్పులతో ఫేస్‌బుక్‌కు సమస్యలు మొదలయ్యాయి. ఈ మార్పుల కారణంగా ఫేస్‌బుక్‌లో ఆయా వాణిజ్య సంస్థలు తమ ప్రకటనలు.. వినియోగదారులను ఎంత మేరకు ప్రభావితం చేశాయో కనుక్కోవడం కష్టంగా మారింది. ప్రపంచంలోనే గూగుల్‌ తర్వాత అతిపెద్ద డిజిటల్‌ వాణిజ్య ప్రకటనల ప్లాట్‌ఫామ్‌ మెటాకు పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని