Demat accounts: కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గాయ్.. కారణాలు ఇవేనా?
Demat accounts: కరోనా సమయంలో విపరీతంగా తెరుచుకున్న డీమ్యాట్ ఖాతాలు.. ఇప్పుడిప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి అనంతరం స్టాక్ మార్కెట్లో (Stock market) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య ఎప్పుడూలేని స్థాయికి చేరింది. దీంతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య భారీ స్థాయిలో వృద్ధి చెందింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి, ఐపీఓలు క్యూ కట్టడం ఇందుకు నేపథ్యం. కానీ, పరిస్థితి ఇప్పుడు మారింది. డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య 2020 డిసెంబర్ తర్వాత తొలిసారి ఆ స్థాయికి చేరింది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి?
దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో మన మార్కెట్లు (Stock market) ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. తర్వాత పుంజుకున్నాయి. కరోనాతో వర్క్ఫ్రమ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం స్టాక్ మార్కెట్ వైపు చూడడం మొదలు పెట్టారు. స్టాక్ మార్కెట్పై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం మార్కెట్లోకి ప్రవేశించారు. దీనికి తోడు కొత్త తరం టెక్ కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్లోకి రావడం విపరీతంగా యువతరాన్ని ఆకర్షించాయి. దీంతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2020 డిసెంబర్లో 10 లక్షలు ఉండగా.. 2021 అక్టోబర్లో గరిష్ఠంగా 35 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటున 29 లక్షలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల చొప్పున లక్షలు చొప్పున ఖాతాలు ఓపెన్ అయ్యాయి. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఏప్రిల్ నెలలో కనిష్ఠంగా 16 లక్షలకు చేరింది. 2020 డిసెంబర్ తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి.
ఎందుకిలా.?
కొత్త డీమ్యాట్ ఖాతాలు సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మునుపటిలా ఆకర్షణీయ ఐపీఓలు లేకపోవడం, మార్కెట్లో ఒడుదొడుకులు, స్మాల్, మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో రాబడులు లేకపోవడం ఇందుకు కారణమని చెప్తున్నారు. గతంలో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన వారు ఐటీ సెక్టార్ షేర్లపై ఆసక్తి చూపే వారు. గత కొంతకాలంగా ఐటీ సెక్టార్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో మదుపరుల్లో ఆసక్తి సన్నగిల్లిందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు వర్క్ఫ్రమ్ హోమ్లు తగ్గుముఖం పట్టడం వల్ల ట్రేడింగ్ చేసే సమయం ఉండడం లేదు. ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారడమూ ఒక కారణం. దీంతో మార్కెట్లవైపు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నది విశ్లేషకుల మాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM