Demat accounts: మార్కెట్లు పడుతున్నాయ్.. డీమ్యాట్ ఖాతాలు తగ్గుతున్నాయ్!
Demat accounts: స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపర్ల డీమ్యాట్ ఖాతా సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది...
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపర్లు మార్కెట్లోకి ప్రవేశించడానికి వెనుకాడుతున్నారు. జూన్ నెలలో కొత్తగా 17.9 లక్షల డీమ్యాట్ ఖాతాలు మాత్రమే తెరిచారు. ఫిబ్రవరి 2021 తర్వాత ఇదే అత్యల్పం. ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం 13 నెలల కనిష్ఠాల వద్ద ట్రేడువుతున్నాయి. రిటైల్ మదుపర్ల ఆసక్తి ఎక్కువగా ఉండే స్మాల్, మిడ్-క్యాప్ షేర్లల్లో భారీ పతనం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో పెట్టుబడిపై సెంటిమెంటు కుంటుపడింది.
స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరిన అక్టోబరు 2021లో అత్యధికంగా 35 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత మార్కెట్లు క్రమంగా దిద్దుబాటుకు గురవుతూ వస్తున్నాయి. అనేకసార్లు పైకి లేచే సంకేతాలు కనపడినప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థిక మాంద్యం.. వంటి వరుస పరిణామాలు మార్కెట్ల సెంటిమెంటుకు గండికొట్టాయి. స్టాక్ మార్కెట్లో రోజువారీ క్రయవిక్రయాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. రిటైల్ మదుపర్లు ట్రేడింగ్ నుంచి దూరం జరగడమే దీనికి ప్రధాన కారణం.
2019-20లో కొత్తగా 50 లక్షల డీమ్యాట్ ఖాతాలు, 2020-21లో 1.5 కోట్ల ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2021-22లో ఆ సంఖ్య 3 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో ఈ స్థాయిలో ఖాతాలు తెరవడం అదే తొలిసారి. 2022 తొలి అర్ధభాగంలో 1.6 కోట్ల ఖాతాలు తెరిచారు. 2021 తొలి ఆరు నెలల్లో నమోదైన 1.24 కోట్ల ఖాతాలతో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 9.65 కోట్లకు చేరింది. వీటిలో చాలా ఖాతాలు క్రియాశీలకంగా లేకపోవడం గమనార్హం. ఐపీఓలు తగ్గడం, మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడమే ఇందుకు కారణం.
2021లో మార్కెట్లు బూమ్లో ఉన్న సమయంలో ఉత్సాహంగా ఈక్విటీల్లోకి ప్రవేశించిన వారి పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. ఈ ఏడాది ఆరంభం, గత ఏడాది ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు సైతం భారీ నష్టాల్లో ఉన్నారు. అయితే, దీర్ఘకాలంలో మదుపు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా కంపెనీల ఫండమెంటల్స్ను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాతే విక్రయాలపై నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
జూన్లో నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు వరుసగా 25%, 35% పతనాన్ని చవిచూశాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నప్పటికీ.. 2021 నాటి గరిష్ఠాలతో పోలిస్తే మాత్రం చాలా దిగువన ఉన్నాయి. రిటైల్ మదుపర్లు ఎక్కువగా ట్రేడింగ్కు ఆసక్తి చూపేది ఈ రెండు రంగాల షేర్లలోనే. మార్కెట్లోని ఈ ఒడుదొడుకుల కారణంగానే కొత్తగా తెరిచే డీమ్యాట్ ఖాతాల సంఖ్యతో పాటు మార్కెట్లో క్రయవిక్రయాలు కూడా తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సమీప భవిష్యత్తుల్లో సూచీల్లో గనక బలమైన పునరుద్ధరణ కనిపించకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?