Elon Musk: ట్రంప్ ట్వీట్ చేయకపోతే ఏంటి..? ఆ ఘోర తప్పిదాన్ని సరిదిద్దా..!
ఇటీవల మస్క్.. ట్రంప్ ట్విటర్ ఖాతాను తిరిగి మనుగడలోకి తీసుకువచ్చారు. కానీ మాజీ అధ్యక్షుడు మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీనిపై మస్క్ స్పందించారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరించి వారం రోజులు గడిచాయి. అయితే.. ఆ తర్వాత ట్రంప్ ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీని గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ స్పందించారు. ఆయన ట్వీట్ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉందన్నారు.
‘ట్విటర్లో ట్రంప్ ట్వీట్ చేయకపోవడంపై నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ, ఆయన ఖాతాను నిషేధించడం వంటి ఘోర తప్పిదం జరిగింది. దానిని సరిచేయడమే ఇక్కడ ప్రధానమైంది. సిట్టింగ్ అధ్యక్షుడి ఖాతాను నిషేధించడంతో అమెరికాలో సగం మంది ప్రజలు ట్విటర్పై విశ్వాసం కోల్పోయారు’ అంటూ ట్రంప్ను వెనక్కి తీసుకురావడం వెనక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించారు.
ఇటీవల ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్ పోల్ నిర్వహించారు. దీనికి 15 లక్షలకు పైగా మంది తమ స్పందనను తెలియజేశారు. మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో మస్క్ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. దాంతో ట్రంప్ ట్విటర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ‘‘బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021, జనవరి 8న ట్రంప్ చేసిన చివరి ట్వీట్తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది. అయితే, తిరిగి ట్విటర్లో క్రియాశీలకంగా మారడంపై మాత్రం ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. తనకు ‘ట్రుత్ సోషల్’ అనే సొంత సామాజిక మాధ్యమం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే