DGCA: మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
విమానంలో మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియా(Air India)కు భారీ జరిమానా పడింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన డీజీసీఏ(DGCA).. ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆ ఘటన జరిగిన న్యూయార్క్-దిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్కు రూ.3 లక్షల పెనాల్టీ విధించింది.
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానం (Flight) బిజినెస్ క్లాసులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్లైన్.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిందితుడు శంకర్ మిశ్రా నాలుగు నెలల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది.
మరోవైపు, జ్యుడిషీయల్ రిమాండ్లో ఉన్న నిందితుడు శంకర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవల కోర్టులో తన వాదనను మార్చడం గమనార్హం. ‘ఈ కేసులో నేను నిందితుడిని కాదు. ఆ మహిళే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుంది. ఆమె ప్రొస్టేట్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోంది. అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమే. కానీ, నేను మాత్రం ఆమెపై మూత్రవిసర్జన చేయలేదు’ అని అతడు కోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను బాధిత మహిళ తీవ్రంగా ఖండించారు.
స్పందించిన ఎయిరిండియా..
‘మాకు డీజీసీఏ ఉత్తర్వులు అందాయి. దానిని మేం పరిశీలిస్తున్నాం. మా లోపాలను సరిచేసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొందరు ప్రయాణికుల వల్ల కలిగే ఈ తరహా అసౌకర్యాలను డీల్ చేసే విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు ఎయిరిండియా కట్టుబడి ఉంది’అని విమానయాన సంస్థ ప్రతినిధి స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.