Union Budget 2022: స్కూల్ విద్యార్థుల కోసం.. వన్ క్లాస్ - వన్ టీవీ ఛానల్
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు దూరమవుతున్నారు.
డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటు
దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు దూరమవుతున్నారు. అందుకే ఈ బడ్జెట్లో విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ ఈ-కంటెంట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు టీవీల ద్వారా అనుబంధ విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యా రంగానికి నిర్మలమ్మ ప్రకటనలివే..
వన్ క్లాస్.. వన్ టీవీ ఛానల్..
‘‘ప్రధాని ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని మరింత విస్తరించనున్నాం. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్ ఛానళ్లు ఉండగా.. వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నాం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనున్నాం. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టీవీ, రేడియోల ద్వారా తరగతుల బోధన ఉంటుంది. ఇక ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు ప్రపంచస్థాయి ఉపకరణాలు అందజేయనున్నాం’’
డిజిటల్ యూనివర్శిటీ..
‘‘విద్యార్థులకు ఐఎస్టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నాం. దేశంలోని ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా, అర్థం అయ్యేలా పలు భారతీయ భాషల్లో కోర్సులను ఈ వర్సిటీ అందించనుంది. ప్రస్తుతమున్న టాప్ యూనివర్సిటీల సహకారంతో ఈ డిజిటల్ వర్సిటీలో కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం’’
వ్యవసాయ వర్సిటిల్లో సిలబస్ మార్పులు
‘‘వ్యవసాయ యూనివర్శిటీల్లో సిలబస్ మార్పులు చేపట్టనున్నాం. జీరో బడ్జెట్ సాగు, సేంద్రీయ సాగు, అధునాత వ్యవసాయం, వాల్యూ అడిషన్ అండ్ మేనేజ్మెంట్ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నాం. సెలబస్ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నాం’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్ బాలికలు?
-
Movies News
Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు