Tata Group: టాటా గ్రూప్ సలహాదారుగా గోపీనాథన్.. చంద్రశేఖరన్ చర్చలు
Tata group: టీసీఎస్ సీఈఓగా రాజీనామా చేసిన రాజేశ్ గోపీనాథన్ను టాటా గ్రూప్ సలహాదారుగా నియమించుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
దిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎండీ, సీఈఓ పదవికి ఇటీవల రాజీనామా చేసిన రాజేశ్ గోపీనాథన్ (Rajesh Gopinathan) సేవలను భవిష్యత్లోనూ వినియోగించుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోంది. సెప్టెంబర్ 15 పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయనను గ్రూప్ సలహాదారుగా నియమించాలనుకుంటోంది. ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ (Tata sons) ఎన్ చంద్రశేఖరన్ రాజేశ్ గోపీనాథన్తో చర్చలు జరుపుతున్నట్లు టాటా గ్రూప్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వివిధ సాంకేతిక విభాగాల్లో ఉన్న ఈ గ్రూప్నకు నిబద్ధత కలిగిన, అనుభవజ్ఞులైన వ్యక్తులు అవసరమని టాటా గ్రూప్ భావిస్తోంది. అందులో భాగంగానే గోపీనాథన్ నోటీసు పీరియడ్ సెప్టెంబర్ 15తో ముగిసిన అనంతరం ఆయనను సలహాదారుగా నియమించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అటు టాటా సన్స్ గానీ, టీసీఎస్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి.
టీసీఎస్ సీఈఓ పదవికి ఇటీవల రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కె కృతి వాసన్ బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా సన్స్ ఛైర్మన్గా 2017 ఫిబ్రవరిలో చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే, టీసీఎస్ పగ్గాలను చంద్రశేఖరన్ నుంచి గోపీనాథన్ అందుకున్నారు. గోపీనాథన్ హయాంలో గడిచిన రెండేళ్లలోనే టీసీఎస్ బ్రాండ్ విలువ 212 శాతం పెరిగి 45.5 బిలియన్ల డాలర్లకు చేరింది. మరోవైపు భవిష్యత్కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలూ వేసుకోలేదని గోపీనాథన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’