ABG Shipyard: తక్కువ సమయంలోనే బ్యాంకులు మోసాన్ని గుర్తించాయి
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ- సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) వైపు అడుగులు వేస్తోంది...
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ- సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి సోమవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బడ్జెట్కు ముందునుంచే సీబీడీసీ విషయమై ఆర్బీఐతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో చర్చల అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయా అంశాల మాదిరిగానే డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంకు తరఫున అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
ఇటీవల గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ రూ.22,842 కోట్ల మేర బ్యాంకులను మోసగించిన వ్యవహారం వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే బ్యాంకులు ఈ మోసాన్ని గుర్తించాయని చెప్పారు. యూపీఏ హయాంలోనే ఏబీజీకి రుణాలు ఇచ్చారని, 2013 నవంబర్లో సంబంధిత అకౌంట్ ఎన్పీఏగా మారిందని తెలిపారు. ‘ఈ తరహా మోసాలను ప్రకటించే ముందు బ్యాంకులు ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తాయి. దాదాపు 52-54 నెలలపాటు పూర్తిస్థాయిలో పరిశీలనలు చేస్తాయి. ఏబీజీ షిప్యార్డ్ విషయంలో మాత్రం సాధారణానికంటే తక్కువ సమయం పట్టింది’ అని మంత్రి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..