DLF: 1,137 ఫ్లాట్లు.. మూడు రోజులు.. రూ.8,000 కోట్లు!
ది ఆర్బర్ పేరిట గురుగ్రామ్లో DLF హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. దీంట్లో ఫ్లాటన్నీ మూడు రోజుల్లోనే అమ్ముడైనట్లు పేర్కొంది. రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపింది.
దిల్లీ: గురుగ్రామ్లోని తమ హౌసింగ్ ప్రాజెక్టులో 1,137 విలాసవంతమైన ఫ్లాట్లను విక్రయించినట్లు ప్రముఖ స్థిరాస్తి సంస్థ DLF లిమిటెడ్ గురువారం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ ధర రూ.ఏడు కోట్ల పైనే ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించింది. కేవలం మూడు రోజుల్లోనే విక్రయాలు పూర్తయినట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో ప్రీమియం ఫ్లాట్లకు ఉన్న గిరాకీకి ఇది నిదర్శనమని పేర్కొంది.
‘‘గురుగ్రామ్లోని సెక్టార్ 63, గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్ ప్రాంతంలో ‘ది ఆర్బర్’ పేరుతో ఈ హౌసింగ్ ప్రాజెక్టును 25 ఎకరాల్లో అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఐదు టవర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 38 - 39 అంతస్తులుంటాయి. ఒక్కో ఫ్లాట్లో 4 బెడ్ రూమ్లు ఉండనున్నాయి’’ అని డీఎల్ఎఫ్ తెలిపింది. అయితే విక్రయాలను అధికారికంగా ప్రారంభించడానికి ముందు నిర్వహించిన ‘ప్రీ-ఫార్మల్ లాంఛ్’లోనే ఈ ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు తెలిపింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్లో డీఎల్ఎఫ్ అతిపెద్ద స్థిరాస్తి సంస్థ. ఏప్రిల్- డిసెంబర్ మధ్య కంపెనీ సేల్స్ బుకింగ్లు 45 శాతం వృద్ధితో రూ.6,599 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆ విలువ రూ.4,544 కోట్లుగా ఉంది. ఈ ఏడాది దిల్లీ, గురుగ్రామ్, పంచకుల, చెన్నైలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 330 మిలియన్ చదరపు అడుగుల్లో 153 ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. రూ.7,500 కోట్ల ఆదాయ అంచనాలతో త్వరలోనే ది ఆర్బర్ ప్రాజెక్టు విక్రయాలు ప్రారంభిస్తామని జనవరిలోనే కంపెనీ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM