మార్కెట్లు నష్టాలలో ఉన్నప్పుడు ఏం చేయాలి?
మార్కెట్లలో ఒడుదొడుకులన్నవి సర్వసాధారణం. తట్టుకొని నిలబడితేనే లాభాలను పొందవచ్చు...
మార్కెట్లలో ఒడుదొడుకులన్నవి సర్వసాధారణం. తట్టుకొని నిలబడితేనే లాభాలను పొందవచ్చు
మార్కెట్ల లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఏ చిన్న కారణంతో అయినా భారీగా లాభపడే అవకాశం ఉంది. ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ ఎలాంటి పరిణామాలైనా మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. పెట్టుబడులు ప్రారంభించే ముందు ఎందులో పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం అన్న విషయంపై స్పష్టత ఉండలంటున్నారు నిపుణులు. అప్పుడు నష్టాలు వచ్చినా షేర్ల ధరలు తగ్గినా ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని వారి సూచన. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు…
1. స్టాక్ మార్కెట్-బిజినెస్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు
జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. కొన్నిసార్లు కష్ట సుఖాలు, లాభాలు,నష్టాలు తప్పవు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా ఎప్పుడూ లాభాలు వస్తాయనే అనుకోవద్దు. కొంతమంది మార్కెట్లలో ఇలా పెట్టుబడి పెట్టగానే అది రెట్టింపు అయిపోవాలని కోరుకుంటారు. కానీ ఇలా ఊహల్లో బతకడం సరైనది కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు, కారణాలు అన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా నడుచుకోవాలి. సంపద సృష్టించుకోవాలనుకునేవారు ఇలా ఆలోచించడం సరైనది కాదు. ఎలాంటి పరిస్థితులో అయినా తట్టుకోగలిగే శక్తి ఉండాలి.
2. విత్తనం నాటగానే ఫలాలు రావు
మీరు స్టాక్ను కొనుగోలు చేస్తున్నారంటే కంపెనీలో కొంత శాతాన్ని కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ ఆదాయం, ఆస్తుల విలువను బట్టి షేరు ధర ఉంటుంది. అయితే కంపెనీ భవిష్యత్తులో మంచి లాభాలు కనబరుస్తుంది, దీంతో లాభం వస్తుందనుకొని పెట్టుబడులు పెట్టడం విత్తనం నాటగానే పండు కోసం వేచిచూసినట్లు ఉంటుంది. దేనికైనా కొంత సమయం అవసరం. మీరు అనుకున్నట్లుగా షేర్ల ధరలు అప్పుడే పెరగకపోయినా, కంపెనీ మంచిదైతే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. మార్కెట్ కొంత ఒత్తిడికి గురైనంత మాత్రాన నిరాశ చెందడం సరికాదు.
3. తగ్గిందంటే ఇంక అంతే కాదు
మార్కెట్ నష్టపోచేందుకుచాలా కారణాలు ఉంటాయి. అవి రుణాలు, వృద్ధి మందగించడం, ఉత్పత్తులు, వ్యూహాత్మ లోపాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరగడం, పెట్టుబడులు తగ్గిపోవడం, వార్తలు, కరెన్సీ విలువ వంటి చాలా ఉంటాయి. అయితే ఈ కారణాలతో కంపెనీ షేర్లు నష్టపోతాయనుకోవడం సరైంది కాదు. కంపెనీ విధానాలను దృష్టిలో పెట్టుకొనే మీరు పెట్టుబడులు ప్రారంభించారు కాబట్టి ఆందోళన అవసరం లేదు. తాత్కాలికంగా ఎలా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది.
4. భయాల కంటే కారణాలు తెలుసుకోవడం ముఖ్యం
చాలా మంది మదుపర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు వారు పెట్టుబడి చేసే స్టాక్ల గురించి పూర్తిగా పరిశోధన చేసి తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకొని పూర్తి నమ్మకంతోనే పెట్టుబడి ప్రారంభించినప్పటికీ, మార్కెట్లు కొంత ఒత్తిడికి గురికాగానే భయపడిపోతారు. కానీ స్టాక్ మార్కెట్ల అంచనాలు రోజు రోజుకి మారిపోతుంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు భయం ఉండకూడదు. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెడితే సంపద మీ సొంతమవుతుందన్న నిజాన్ని గుర్తించాలి.
5. పరిస్థితులను ఎదుర్కోవాలి
అనుభవం గల పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్లు నష్టపోయినప్పడు దాన్ని వారికి అనుగుణంగా మలుచుకుంటారు. అప్పుడు మరింత పెట్టుబడులను మరింత పెంచుకుంటారు. అందరూ అంత ధైర్యం చేయరు. లాభాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారు కానీ, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడినవారికే విజయం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!