Inflation: ద్రవ్యోల్బణం నికర రాబడిని ఏవిధంగా తగ్గిస్తుందో తెలుసా?
దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి.
ఇల్లు కొనుగోలు, పిల్లల విద్య, వివాహం, పదవీ విరమణ..ఇలా ప్రతీ ఒక్కరికీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యానికి తగినట్లు ఆర్థిక ప్రణాళిక మనలో చాలామంది వేసుకొని ఉంటారు. అయితే, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొనే ఆర్థిక ప్రణాళిక వేశారా? ఎందుకంటే ద్రవ్యోల్బణం రూపాయి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది. అందువల్ల ముందు నుంచి దీనిపై అవగాహనతో ఉండడం చాలా అవసరం.
అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులపై వచ్చే నికర రాబడిని తగ్గిస్తుంది. ఉదాహరణకు, మీ ఫోర్ట్ఫోలియో దీర్ఘకాలంలో పన్నులు తీసివేసిన తర్వాత 8 శాతం రాబడిని ఇస్తుందనుకుందాం. వార్షిక ద్రవ్యోల్బణం కూడా 8 శాతం ఉంటే..వాస్తవిక రాబడి దాదాపు శూన్యం అవుతుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం 8 శాతం ఉండి మీ పెట్టుబడులపై రాబడి 6 శాతం మాత్రమే ఉంటే..మీ పొదుపు మొత్తం భవిష్యత్తు అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అందువల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి.
పిల్లల ఉన్నత చదువుల కోసం అయితే..
మీరు మీ పిల్లల ఉన్నత చదువుల కోసం మదుపు చేస్తున్నారనుకుందాం. మీరు కోరుకునే విద్య కోసం నేడు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ లక్ష్య సాధనకు ఉన్న సమయాన్ని, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి కావాల్సిన మొత్తాన్ని లెక్కించి దానికి తగినట్లుగా పెట్టుబడులు చేయాలి. ఉదాహరణకు, మీ పిల్లల ఉన్నత విద్యకు నేడు దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చువుతుంది అనుకుందాం. పిల్లల చదువుకు 15 ఏళ్ల సమయం ఉంది అనుకుంటే..వార్షిక ద్రవ్యోల్బణాన్ని 7 శాతం (విద్యా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది)గా అంచనా వేస్తే, 15 ఏళ్ల తర్వాత అదే విద్యను అభ్యసించేందుకు దాదాపు రూ. 70 లక్షలు అవసరమవుతాయి. అంటే, మీరు రూ. 25 లక్షల కోసం కాకుండా రూ. 70 లక్షలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
పదవీ విరమణ కోసం అయితే..
అదే పదవీ విరమణ కోసం పెట్టుబడులు పెడుతుంటే..ప్రస్తుతం ఉన్న నెలవారి ఖర్చులను అంచనావేయండి. దానికి ద్రవ్యల్భణాన్ని చేర్చి పదవీ విరమణ తర్వాత నెలవారి ఖర్చులకు ఎంత అవసరం అవుతుందో అంచనా వేయవచ్చు. చాలా మంది పదవీ విరమణ తర్వాత బాధ్యతలు తగ్గుతాయి కాబట్టి ఇప్పటి కంటే తక్కువే ఖర్చువుతుందని..అదే ఉద్దేశ్యంతో పెట్టుబడి పెడుతుంటారు. పదవీవిరమణ తర్వాత బాధ్యతలు తగ్గొచ్చు. కానీ వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు..జీవిన శైలి మెరుగుపడడం వంటి కారణాలతో ఖర్చు ఏమాత్రం తగ్గదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, నేడు ఖర్చుల కోసం నెలవారిగా రూ. 30 వేలు అవసరమవుతుంటే..7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తే 25 ఏళ్ల తర్వాత నెలవారి ఖర్చుకు దాదాపు రూ.1,62,822 అవసరమవుతాయి. దీనికోసం సుమారుగా రూ.4.60 కోట్ల పదవీ విరమణ నిధి అవసరం అవుతుంది. ఈ మొత్తాన్ని సమకూర్చాలంటే, 10 శాతం రాబడి అంచనాతో 25 ఏళ్ళ పాటు ప్రతి నెలా రూ. 35 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. అదే 12 శాతం అంచనాతో అయితే సుమారుగా రూ. 23 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి కోసం ఎన్పీఎస్ లాంటి పధకాలను ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ లో ఇప్పటికే మదుపు చేస్తున్నట్టయితే దానికి తగినట్టు మీ పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.
సరిగ్గా అంచనా వేయకపోతే..?
ఒక వేళ మీరు లక్ష్యం కోసం కావాల్సిన మొత్తాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పిల్లల ఉన్నత చదువులకు ఇంకా 15 ఏళ్ల సమయం ఉండి..ఈ రోజు వారిని చదివించాలనుకున్న కోర్సుకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి అదే మొత్తాన్ని అంచనా వేసి మదుపు చేయడం మొదలు పెడితే ఈ లక్ష్యం కోసం 10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 6000 కేటాయిస్తే సరిపోతుంది. కానీ ద్రవ్యోల్బణంతో పెరిగే ఖర్చులకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. 10 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గమనిస్తే..అప్పటికి మీరు పోగు చేసే మొత్తం దాదాపు రూ. 12 లక్షలు మాత్రమే. నిజానికి మీకు కావాల్సిన మొత్తం రూ. 70 లక్షలు (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే). అంటే ఇంకా రూ. 58 లక్షలు కావాలి. ఉన్న సమయం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడబెట్టాలంటే 10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 75 వేలు పెట్టుబడి పెట్టాలి. ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం కష్టమే అవుతుంది. మరో విషయం ఏంటంటే..ఇక్కడ మనం 10 శాతం రాబడి అంచనా వేస్తున్నాం. మ్యూచవల్ ఫండ్లు వంటి వాటిలో దీర్ఘకాలంలో మాత్రమే 10 నుంచి 15 శాతం రాబడి ఆశించగలం. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిలో ఐదేళ్లలో 5 నుంచి 7 శాతం మాత్రమే రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.
అదే మీరు ముందుగానే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి రూ. 70 లక్షలు లక్ష్యంగా పెట్టుబడులు పెడితే..10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 16 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 15 ఏళ్లలో ఈ మొత్తాన్ని సమకూర్చుకోలుగుతారు.
చివరిగా..
ద్రవ్యోల్బణం మీ లక్ష్యానికి మిమ్మల్ని దూరం చేస్తుంది. దాని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..సరైన విధంగా లెక్కించి సరైన ప్రణాళికలతో మదుపు చేయడం ఒక్కటే మార్గం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా