Air Passenger Traffic: దేశీయ విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డు
దేశీయ విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గడిచిన రెండు రోజుల్లో దేశీయంగా సుమారు తొమ్మిది లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు.
దిల్లీ: గడిచిన రెండు రోజుల్లో దేశీయంగా విమాన ప్రయాణాలు చేసిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఆదివారం రోజునే దేశీయంగా సుమారు 4,56,910 మంది ప్రయాణించగా, శనివారం 4,56,748 మంది ప్రయాణించినట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది రికార్డు స్థాయి పెరుగుదలని పేర్కొంది.
‘‘కొవిడ్ పరిస్థితుల తర్వాత దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని పొందడమే కాకుండా.. స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సానుకూల వైఖరి, ప్రగతిశీల విధానాలు, ప్రయాణికుల్లో పెరిగిన విశ్వాసం వంటివి దేశీయ విమాన సర్వీసులను ప్రతి రోజూ కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి’’ అని విమానయాన శాఖ ట్వీట్ చేసింది. గతేడాది నవంబరు 19న దేశీయంగా 5,506 విమాన సర్వీసుల ద్వారా 3,93,391 మంది ప్రయాణిస్తే.. ఈ ఏడాది అదే రోజున 5,958 విమాన సర్వీసుల ద్వారా 4,56,910 మంది ప్రయాణించారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.
స్టీవ్ జాబ్స్ నుంచి శామ్ ఆల్ట్మన్ దాకా.. సొంత సంస్థల్లోనే ఉద్యోగం కోల్పోయిన సీఈఓలు
‘‘భారత్లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ గత రికార్డులను అధిగమించింది. వరుసగా రెండు రోజులు రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమానయానం చేశారు. ఇది దేశీయ విమానయాన రంగం సాధించిన ఘనత. ఇది దేశ ప్రజల సమిష్ఠి విజయం. అంతర్జాతీయంగా అతి పెద్ద విమానయాన మార్కెట్గా అవతరించకుండా భారత్ను ఎవరూ అడ్డుకోలేరు’’ అని సింధియా ట్వీట్ చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో భారత్లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11 శాతం పెరిగింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tecno Spark Go: ₹6,699కే టెక్నో కొత్త మొబైల్.. 5,000mAh బ్యాటరీ, 13ఎంపీ కెమెరా
Tecno Spark Go 2024: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. స్పార్క్ గో 2024 పేరుతో కొత్త మొబైల్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Adani group: యూఎస్ ఏజెన్సీ నివేదిక.. అదానీ స్టాక్స్ జూమ్
Adani stocks zoom: అదానీ గ్రూప్ షేర్లు మంగళవారం కూడా దూసుకెళ్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇచ్చిన నివేదిక ఇందుకు కారణం. -
Royal Enfield: ‘రీఓన్’తో సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
Royal Enfield: తమ బైక్లను కస్టమర్లకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. -
Indian Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఎస్అండ్పీ
Indian Economy: వచ్చే కొన్నేళ్లపాటు భారత్ మెరుగైన వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. ఈ క్రమంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది. -
Byjus: ఉద్యోగుల వేతనాల కోసం ఇళ్లను తనఖా పెట్టిన బైజూ రవీంద్రన్!
Byjus: బైజూస్లో ఆర్థిక కష్టాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కోసం వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన సొంతిళ్లను తనఖా పెట్టినట్లు సమాచారం. -
Stock Market: లాభాల్లో సూచీలు.. 69,000 మార్క్ దాటిన సెన్సెక్స్
Stock Market Opening bell | ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 68,957 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 20,725 వద్ద కొనసాగుతోంది. -
రికార్డుల మోత మోగింది
అంచనాలను మించి కేంద్రంలోని భాజపా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. దేశీయ స్టాక్మార్కెట్లు దూసుకెళ్లేందుకు కారణమయ్యాయి. 5 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) విజయం సాధించడంతో సోమవారం దేశీయ సూచీలు తారాజువ్వల్లా ఎగిశాయి. -
అంచనాలకు ముందుగానే 5 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థికవ్యవస్థ!
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాలైన 2027-28 కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని, తద్వారా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలిపారు. -
రూ.12 లక్షల కోట్లకు అదానీ గ్రూప్ మార్కెట్ విలువ
అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర సంపద గతవారం మొత్తం మీద 5.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.46,500 కోట్లు) పెరిగినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ఆధారంగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం ఇందుకు నేపథ్యం. -
ముకేశ్ అంబానీపై సెబీ ఆదేశాల కొట్టివేత
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన అపరాధ రుసుమును విధిస్తూ సెబీ ఇచ్చిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) పక్కనపెట్టింది. 2007 నవంబరులో రిలయన్స్ పెట్రోలియం (ఆర్పీఎల్) షేర్ల ట్రేడింగ్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో శాట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
6 విమానాశ్రయాల లీజు వల్ల ఏటా రూ.515 కోట్లు ఆదా
2018 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) ఆరు విమానాశ్రయాలను అద్దెకు ఇవ్వడం వల్ల, నిర్వహణా వ్యయాల రూపంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఏటా రూ.515 కోట్లు ఆదా అవుతున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశీయంగా ఐఫోన్ బ్యాటరీల తయారీలోకి జపాన్ సంస్థ
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ టీడీకే కార్ప్.. మన దేశంలో యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయనుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. తమ ఉత్పత్తిలో కొంతభాగాన్ని చైనా వెలుపలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్న యాపిల్, ఇందుకోసం మనదేశంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. -
ద్రవ్య లభ్యత పరిమితుల వల్లే వైజాగ్ స్టీల్ కార్మికుల వేతనాలు ఆలస్యం
ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ అయిన ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో తమ కార్మికులకు వేతనాలను ఆలస్యంగా చెల్లించింది. -
అంతరిక్ష అంకురాలకు నిధులు
పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ అంశాల్లో పనిచేస్తున్న అంతరిక్ష అంకురాలకు ప్రాథమిక నిధులను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) వెల్లడించింది. -
స్పాటిఫైలో 1,500 ఉద్యోగాల కోత
సంగీత స్ట్రీమింగ్ సేవలు అందిస్తున్న స్పాటిఫై, మరో విడతలో 1,500 మంది (17 శాతం) ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. -
వినికిడి లోపం ఉన్నవారికి భారత్లో తొలి వీసా సమాచార కేంద్రం
వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా, స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్లో తొలి ‘సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్’ను వీఎఫ్ఎస్ గ్లోబల్ ఆవిష్కరించింది. -
డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ 13 నుంచి
పెన్సిల్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న డోమ్స్ ఇండస్ట్రీస్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబరు 13న ప్రారంభమై 15న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా రూ.350 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్లో మరో రూ.850 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. -
2025 కల్లా ఓఎన్డీసీకి కోటి మంది వ్యాపారులను తెస్తాం
ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) ప్లాట్ఫామ్కు 2025 కల్లా కోటి మంది వ్యాపారులను తీసుకురావాలని పేటీఎమ్ బ్రాండ్పై సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ యోచనగా ఉంది. ఓఎన్డీసీ ప్లాట్ఫాం నుంచి తమ వద్దకు 1.18 కోట్ల మంది వినియోగదార్లు వచ్చారని సోమవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో శర్మ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ సంస్థ, గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్., సిల్డెనాఫిల్ ఓరల్ సస్పెన్షన్ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు వయాట్రిస్ స్పెషాలిటీ ఎల్ఎల్సీ అనే సంస్థకు చెందిన రెవాటియో బ్రాండుకు జనరిక్ ఔషధం. -
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది.


తాజా వార్తలు (Latest News)
-
Nimmala Ramanaidu: తుపాను హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదు: నిమ్మల రామానాయుడు
-
ప్లీజ్.. మా వాళ్లను సైన్యంలోకి తీసుకోవద్దు: రష్యాను కోరిన నేపాల్
-
Hamas: ఇజ్రాయెల్ అణు క్షిపణి స్థావరంపై అక్టోబర్ 7న దాడి..!
-
America: గన్తో కాల్పులు.. ఇంట్లో భారీ పేలుడు
-
IPL 2024: కామెరూన్ గ్రీన్ ట్రేడింగ్.. ఆర్సీబీకి గొప్ప ఛాయిస్ కాదు: బ్రాడ్ హాగ్
-
Vishnu Vishal: తుపాను ఎఫెక్ట్.. సాయం కోరిన హీరో.. స్పందించిన రెస్క్యూ విభాగం