Air traffic: విమాన ప్రయాణాల్లో బిగ్ జంప్.. విమాన సంస్థల్లో ఇండిగోనే టాప్
Air traffic data: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క మార్చి నెలలో కోటీ 28 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఈ మేరకు డీజీసీఏ డేటాను వెలువరించింది.
దిల్లీ: దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటోంది. కొవిడ్ సమయంలో అతలాకుతలం అయిన ఈ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా ఏకంగా 3.75 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే సమయంలో 2.47 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 51.7 శాతం మేర పెరగడం గమనార్హం. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డేటాను విడుదల చేసింది. ఒక్క మార్చిలోనే 128.93 లక్షల మంది (1.28 కోట్లు) ప్రయాణాలు చేసినట్లు పేర్కొంది. గతేడాది మార్చిలో ఈ సంఖ్య 106.19 లక్షలుగా ఉంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య 21.41 శాతం మేర పెరగడం గమనార్హం.
మార్కెట్ వాటా పరంగా దేశీయ అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో (Indigo) మార్చి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ప్రయాణికుల్లో 56.8 శాతం వాటా ఇండిగోదే. మార్చి నెలలో మొత్తం 73.17 లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణించారు. ఈ విషయంలో 8.9 శాతం మార్కెట్ వాటాతో విస్తారా (11.49) రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా 8.8 శాతం వాటా (11.39 లక్షలు)తో మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించి ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా మునుపటి నెలతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు పెరిగిందని డీజీసీఏ తెలిపింది. అదే సమయంలో స్పైస్జెట్ మార్కెట్ వాటా 70 పాయింట్లు, గో ఫస్ట్ విమానాల మార్కెట్ వాటా 100 బేఏసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం.
ఇక పాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (ఆక్యుపెన్సీ) విషయాన్ని పరిశీలిస్తే.. స్పైస్జెట్ ఈ విషయంలో 92.3 శాతంతో ముందు వరుసలో ఉంది. 91.6 శాతంతో విస్తారా, 90.2 శాతంతో గోఫస్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చినెలలో క్యాన్సిలేషన్ రేటు సైతం 0.28 శాతంగా ఉందని డీజీసీఏ వెల్లడించింది. మొత్తం 347 మంది ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందగా.. అత్యధికంగా ఇండియా వన్ఎయిర్ మీదే రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో