Wireless jammers: వైర్లెస్ జామర్ల విక్రయంపై ఇ కామర్స్ సంస్థలకు కేంద్రం వార్నింగ్
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్ల విక్రయంపై ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని విక్రయించకూడదని పేర్కొంది.
దిల్లీ: వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్ల విక్రయంపై ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని విక్రయించకూడదని పేర్కొంది. ఈ మేరకు టెలికాం విభాగం సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెల్యులర్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు, ఇతర సిగ్నల్ జామింగ్ వస్తువులను విక్రయించడం నేరమని డాట్ తన ప్రకటనలో పేర్కొంది. వాటికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ప్రైవేటు వ్యక్తులకు గానీ, ప్రైవేటు సంస్థలు గానీ వాటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించడం నేరమని తెలిపింది.
లైసెన్సు పొందిన టెలికాం సర్వీసు ప్రొవైడర్లు మినహా ఏ కంపెనీ కూడా సిగ్నల్ బూస్టర్లు, సిగ్నల్ రిపీటర్లను వినియోగించకూడదని డాట్ తెలిపింది. అనుమతి లేకుండా వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం వైర్లెస్ టెలీగ్రఫీ చట్టం, 1933 చట్టం, ఇండియా టెలీగ్రాఫ్ చట్టం, 1885 కింద నేరమని డాట్ హెచ్చరించింది. తాజా ప్రకటన కాపీని పలు ప్రభుత్వ శాఖలకు కూడా పంపింది. గత నాలుగైదేళ్లుగా డాట్ ఇలాంటి హెచ్చరికలు చేస్తూనే ఉంది. పలుమార్లు అక్రమ విక్రయాలపై సోదాలు నిర్వహించి సీజ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!