హాలిడే రోజు పనిచెప్తే ₹ లక్ష జరిమానా.. భారతీయ కంపెనీ కొత్త పాలసీ!
సెలవులో ఉన్న ఉద్యోగిని పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు డ్రీమ్ 11 కంపెనీ కొత్త పాలసీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హాలిడే రోజున ఉద్యోగికి పని పురమాయించిన సహోద్యోగులకు భారీగా జరిమానా విధించనుంది.
దిల్లీ: ఆఫీస్లో పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోగానే.. కొలీగ్ లేదా బాస్ నుంచి ముఖ్యమైన పని ఉందంటూ మెసేజ్ లేదా ఫోన్లు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు సెలవులో ఉన్నా కూడా పని గురించి సందేహాలున్నాయని సహోద్యోగులు ఫోన్ చేస్తుంటారు. కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్న హాలిడే కాస్తా.. వర్క్ఫ్రమ్ హోమ్గా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో కోపం రావడం సహజం. ఇది ఉద్యోగి రోజువారీ విధులపై ప్రభావం చూపిస్తుందట. అందుకే సెలవులో ఉన్న ఉద్యోగిని ఆఫీస్లో ఉన్నవారు పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కార్పొరేట్ కంపెనీలు సరికొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాయి. తాజాగా డ్రీమ్ 11 (Dream11) కంపెనీ ‘డ్రీమ్11 అన్ప్లగ్’ పేరుతో కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్కు సంబంధించిన ఎలాంటి పని కేటాయించకూడదు. ఒకవేళ పనికి సంబంధించి ఫోన్, మెసేజ్, ఈ-మెయిల్ చేసినా.. బాస్తోపాటు, ఫోన్ చేసిన ఉద్యోగికి కంపెనీ జరిమానా విధిస్తుంది. ‘‘మనకు ఎంతో ఇష్టమైన వారితో విహారయాత్రకు వెళ్లేందుకు, వారితో కొంత సమయం గడిపేందుకు లేదా పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం సెలవులు తీసుకుంటాం. ఇలాంటివి ఉద్యోగి జీవనప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, ఉత్పాదకను పెంపొందించేందుకు దోహదపడతాయి. అందుకే సెలవు రోజుల్లో ఆఫీస్ నుంచి ఉద్యోగికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ పాలసీని అమలు చేస్తున్నాం. అంతేకాకుండా కంపెనీ ఏ ఒక్క ఉద్యోగిపైనే ఆధారపడి పనిచేయడంలేదని చెప్పడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ’’ అని డ్రీమ్11 తెలిపింది. ఈ పాలసీ ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగికి ఆఫీస్ పని కోసం ఫోన్ చేసిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. ఇది కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగికి వర్తిస్తుందని డ్రీమ్11 వెల్లడించింది.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి డ్రీమ్11 సుపరిచితమే. క్రికెట్ సహా హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ట్విటర్, మెటా వంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ సంస్థలో పనిచేసేందుకు రావాలని డ్రీమ్11 సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త పాలసీ అమలుతో మరోసారి డ్రీమ్11 వార్తల్లో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 16 శాతం మేర తగ్గింది. -
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఎన్పీసీఐ సిద్ధమైంది. -
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
EPF Withdraw: నగదు ఉపసంహరణలో ఈపీఎఫ్వో కీలక మార్పు చేసింది. ఇకపై చందాదారులు వైద్య చికిత్స కోసం రూ.లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు. -
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
Steve Jobs: యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షిల్లర్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా రావాల్సిన ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. -
మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ నిర్ణయం: అమెరికా
USA-India: డబ్ల్యూటీఓ వివాదాల పరిష్కారం తర్వాత కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించినట్లు అగ్రరాజ్యం తెలిపింది. -
అంతర్జాతీయ మార్గాల్లో జాగ్రత్త
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. -
2024లో వృద్ధి రేటు 6.8%
ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. -
రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్ ఎగుమతులు
మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. -
ఈ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం
మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) దక్కించుకుంది. -
3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఐటీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి. -
ఫండ్లలోకి 35% పెరిగిన పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది. -
‘ఎక్స్’ నూతన వినియోగదార్లు పోస్ట్, లైక్కు రుసుము చెల్లించాలి
ఎక్స్ (గతంలో ట్విటర్) ఫ్లాట్ఫామ్పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్, పోస్ట్, బుక్మార్క్, రిప్లయ్ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది. -
పెద్ద ఆర్డర్ల డెలివరీకి జొమాటో ప్రత్యేక వాహనం
50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది. -
రెండేళ్లలో రూ.1000 కోట్ల విక్రయాలు!
ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. -
రైతులకు నేరుగా రుణాలు ఇవ్వం: నాబార్డ్
తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) మంగళవారం స్పష్టం చేసింది. -
‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి భారత పేటెంట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్ ఆఫీస్ (ఐపీఓ) పేటెంట్ మంజూరు చేసింది. -
ఫ్లిప్కార్ట్ వేసవి విక్రయాలు నేటి నుంచి
ఫ్లిప్కార్ట్ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్