హాలిడే రోజు పనిచెప్తే ₹ లక్ష జరిమానా.. భారతీయ కంపెనీ కొత్త పాలసీ!
సెలవులో ఉన్న ఉద్యోగిని పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు డ్రీమ్ 11 కంపెనీ కొత్త పాలసీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హాలిడే రోజున ఉద్యోగికి పని పురమాయించిన సహోద్యోగులకు భారీగా జరిమానా విధించనుంది.
దిల్లీ: ఆఫీస్లో పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోగానే.. కొలీగ్ లేదా బాస్ నుంచి ముఖ్యమైన పని ఉందంటూ మెసేజ్ లేదా ఫోన్లు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు సెలవులో ఉన్నా కూడా పని గురించి సందేహాలున్నాయని సహోద్యోగులు ఫోన్ చేస్తుంటారు. కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్న హాలిడే కాస్తా.. వర్క్ఫ్రమ్ హోమ్గా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో కోపం రావడం సహజం. ఇది ఉద్యోగి రోజువారీ విధులపై ప్రభావం చూపిస్తుందట. అందుకే సెలవులో ఉన్న ఉద్యోగిని ఆఫీస్లో ఉన్నవారు పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కార్పొరేట్ కంపెనీలు సరికొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాయి. తాజాగా డ్రీమ్ 11 (Dream11) కంపెనీ ‘డ్రీమ్11 అన్ప్లగ్’ పేరుతో కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్కు సంబంధించిన ఎలాంటి పని కేటాయించకూడదు. ఒకవేళ పనికి సంబంధించి ఫోన్, మెసేజ్, ఈ-మెయిల్ చేసినా.. బాస్తోపాటు, ఫోన్ చేసిన ఉద్యోగికి కంపెనీ జరిమానా విధిస్తుంది. ‘‘మనకు ఎంతో ఇష్టమైన వారితో విహారయాత్రకు వెళ్లేందుకు, వారితో కొంత సమయం గడిపేందుకు లేదా పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం సెలవులు తీసుకుంటాం. ఇలాంటివి ఉద్యోగి జీవనప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, ఉత్పాదకను పెంపొందించేందుకు దోహదపడతాయి. అందుకే సెలవు రోజుల్లో ఆఫీస్ నుంచి ఉద్యోగికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ పాలసీని అమలు చేస్తున్నాం. అంతేకాకుండా కంపెనీ ఏ ఒక్క ఉద్యోగిపైనే ఆధారపడి పనిచేయడంలేదని చెప్పడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ’’ అని డ్రీమ్11 తెలిపింది. ఈ పాలసీ ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగికి ఆఫీస్ పని కోసం ఫోన్ చేసిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. ఇది కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగికి వర్తిస్తుందని డ్రీమ్11 వెల్లడించింది.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి డ్రీమ్11 సుపరిచితమే. క్రికెట్ సహా హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ట్విటర్, మెటా వంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ సంస్థలో పనిచేసేందుకు రావాలని డ్రీమ్11 సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త పాలసీ అమలుతో మరోసారి డ్రీమ్11 వార్తల్లో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు