e-rupee: మరో 5 బ్యాంకులు, 9 నగరాల్లో ఇ-రూపీ ప్రయోగాలు
e-rupee: రిటైల్ ఇ-రూపీ ప్రయోగాలను మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. మరిన్ని బ్యాంకులు సైతం ఇందులో పాలుపంచుకోనున్నాయని ఆర్బీఐ తెలిపింది.
ముంబయి: ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇ-రూపీ (e-rupee) ప్రయోగాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరింత విస్తృతం చేయనుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా వ్యవహరించే ఈ ఇ-రూపీ రిటైల్ ప్రయోగాలను మరో 5 బ్యాంకులు, 9 నగరాలకు విస్తరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. టోకు అవసరాలకు సంబంధించిన ఇ-రూపీ ప్రయోగాలను గతేడాది నవంబర్ 1న, రిటైల్ అవసరాలకు సంబంధించిన ఇ-రూపీని డిసెంబర్ 1న ఆర్బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రిటైల్ ఇ-రూపీని ప్రయోగాత్మకంగా 50 వేలమంది వినియోగదారులు, 5 వేల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఐదు నగరాల్లో 8 బ్యాంకుల్లో ఈ సేవలను అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవి శంకర్ తెలిపారు. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇ-రూపీ విషయంలో ఆదరాబాదరాగా వెళ్లాలని ఆర్బీఐ అనుకోవడం లేదన్నారు. ఎలాంటి అవరోధాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో నెమ్మదిగా ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ రిటైల్ ఇ-రూపీ ప్రయోగాల్లో భాగస్వాములయ్యాయి. వినియోగదారులు, వ్యాపారులతో కూడిన ఎంపిక చేసిన సమూహం మధ్య ప్రయోగాలు జరుగుతున్నాయి. డిజిటల్ కరెన్సీ అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ఇది వరకే స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాఅందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా