E-rupee: చలామణీలో ₹130 కోట్ల డిజిటల్ రూపాయిలు: నిర్మలా సీతారామన్
దేశంలో ఇ-రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. మూడు నెలలుగా వీటి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 130 కోట్లకు పైగా డిజిటల్ రూపాయలు చలామణీలో ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దిల్లీ: చట్టబద్ధ కరెన్సీకి అదనంగా తీసుకొస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (ఇ-రూపీ) ప్రయోగాలు దేశంలో కొనసాగుతున్నాయి. రిటైల్, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న ఈ కరెన్సీ (E-rupee) విలువ ప్రస్తుతం రూ.130 కోట్లపైనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) తెలిపారు. ఫిబ్రవరి 28 నాటికి రిటైల్ డిజిటల్ రూపాయలు (e?-R) రూ.4.14 కోట్లు, హోల్సేల్ (e?-W) రూ.126.27 కోట్లు చొప్పున చలామణీలో ఉన్నాయని లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపాయిని గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న హోల్సేల్ విభాగంలో, డిసెంబర్ 1 నుంచి రిటైల్ విభాగంలో దీని ప్రయోగాలు ప్రారంభించింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు కలిపి మొత్తం 9 బ్యాంకులు హోల్సేల్ పైలట్ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.
బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరపొచ్చని కేంద్రమంత్రి చెప్పారు. టీ దుకాణాదారులు, పండ్ల విక్రేతలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులతో పాటు రిటైల్ ఔట్లెట్లు, పెట్రోల్ పంపులు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. కొన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు సైతం ఉన్నాయని చెప్పారు. ప్రయోగాల్లో భాగంగా సాంకేతిక పనితీరు, డిజైన్ గురించి తెలుసుకుంటున్నామని, వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఇ-రూపీని దశలవారీగా విస్తరించే అంశంపై దృష్టి సారించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
చలామణీలో ఉన్న నగదు ₹31 లక్షల కోట్లు
2014 నాటికి ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నగదు విలువ రూ.13 లక్షల కోట్లుగా కాగా.. ఆ విలువ 2022 నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ (నోట్లు, నాణేలు కలిపి) వాటా 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగిందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016 మార్చి నాటికి రూ.16.63 లక్షల కోట్లుగా ఉన్న నగదు విలువ.. 2017 మార్చి నాటికి రూ.13.35 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ మరుసటి ఏడాది నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నల్లధనం నిరోధించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నకిలీ నోట్ల అరికట్టేందుకే పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..