GST: ‘ఒకే జీఎస్టీ రేటు ఉండాలి’.. ప్రధాని ఈఏసీ ఛైర్మన్ సలహా!
ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేబ్రాయ్ దేశ పన్నుల వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై పలు కీలక సూచనలు చేశారు. ఒకే జీఎస్టీ రేటుతో పాటు మినహాయింపులు లేని పన్నుల వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
దిల్లీ: భారత్లో ఒకేరకమైన జీఎస్టీ రేటు ఉండాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఛైర్మన్ వివేక్ దేబ్రాయ్ అన్నారు. అలాగే మినహాయింపులు లేని పన్ను వ్యవస్థ ఉండాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటా జీడీపీలో కేవలం 15 శాతమేనని తెలిపారు. అదే ప్రజా మౌలిక వసతులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువని పేర్కొన్నారు. ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని.. వీటిని మండలి ప్రతిపాదనలుగా భావించొద్దని కోరారు.
ఉన్నత వర్గాలు వినియోగించేవిగా భావించే వస్తువులు, నిత్యావసరాలపై విధించే పన్ను రేట్లలో ఉన్న అంతరాన్ని తొలగిస్తే అనేక సంక్లిష్టతలకు పరిష్కారం దొరుకుతుందని దేబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తితో సంబంధం లేకుండా ఒకేరకమైన పన్ను ఉండాలన్నారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు సగటు పన్ను రేటు 17 శాతంగా ఉంటుందని ఆర్థిక వ్యవహారాల విభాగం అంచనా వేసిందని తెలిపారు. కానీ, అది ప్రస్తుతం 11.5 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు పన్ను మినహాయింపుల వల్ల ప్రభుత్వం జీడీపీలో 5-5.5 శాతం ఆదాయం కోల్పోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పన్నులు కట్టడం లేదా ప్రభుత్వం నుంచి పొందే సేవలు, వసతుల్ని తగ్గించుకోవడం.. రెండింట్లో ఏదో ఒకదానికి ప్రజలు సిద్ధపడాలన్నారు. పన్ను ఎగవేత చట్టవిరుద్ధమైన నేపథ్యంలో చాలా మంది మినహాయింపు నిబంధనల్లోని లొసుగుల్ని ఆసరా చేసుకొని లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మినహాయింపులతో కూడిన పన్నుల వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు.
కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను మధ్య ఉన్న కృత్రిమ వ్యత్యాసాన్ని సైతం తొలగించాలని దేబ్రాయ్ తెలిపారు. నమోదుకాని సంస్థల్లో చాలా వరకు వ్యక్తిగత హోదాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వ్యత్యాసాన్ని తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM