ED: ఏబీజీ షిప్యార్డ్పై ఈడీ కొరడా.. రూ.2,747 కోట్ల ఆస్తులు అటాచ్!
దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్యార్డ్ (ABG Shipyard) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా కొరడా ఝులిపించింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా...
దిల్లీ: దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్యార్డ్ (ABG Shipyard) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా కొరడా ఝుళిపించింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా రూ.2,747 కోట్లకుపైగా విలువైన షిప్యార్డ్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లను అటాచ్ చేసినట్లు గురువారం వెల్లడించింది. కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్ రిషి కమలేశ్ అగర్వాల్ను సీబీఐ(CBI) అరెస్టు చేసిన మరుసటి రోజే ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
గుజరాత్లోని సూరత్, దహేజ్లలో ఉన్న షిప్యార్డ్లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు; గుజరాత్, మహారాష్ట్రలోని వాణిజ్య, నివాస స్థలాలు; ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్, దాని గ్రూప్ కంపెనీలు, ఇతర సంబంధిత సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు జప్తు చేసిన వాటిలో ఉన్నాయని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం’ కింద అటాచ్ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.2,747.69 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది.
షిప్పుల తయారీ, రిపేర్ వ్యవహారాలను చూసే గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకుల్ని రూ.23 వేల కోట్ల మేర మోసగించిన విషయం తెలిసిందే. రుణాలుగా తీసుకున్న మొత్తాలను అక్రమ కార్యకలాపాలకు, నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ నిర్వహించిన ఆడిట్లో తేలింది. దీనిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ ఏడాది మొదట్లో రిషి అగర్వాల్తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది. బుధవారం రిషి అగర్వాల్ను అరెస్ట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.