Eenadu Property Show: అక్టోబరు 30, 31 తేదీల్లో హైటెక్స్లో ‘ఈనాడు ప్రాపర్టీ షో’
మీ కలలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ‘ఈనాడు ప్రాపర్టీ షో’.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Real Estate) చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న ‘ఈనాడు ప్రాపర్టీ షో’ (EENADU Property Show) మరలా మీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికి ౩1 ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించిన ‘ఈనాడు ప్రాపర్టీ షో’ తన 32వ ఎడిషన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అక్టోబరు 30, 31 తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్ (Hyderabad) నగరంలో అతి పెద్ద ప్రాపర్టీ షోగా నిలవనుంది. మీ అన్వేషణ ప్రీమియం విల్లా అయినా, బడ్జెట్ హౌస్ అయినా, ప్లాట్స్, ఫ్లాట్స్ అయినా, మీ కలలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ‘ఈనాడు ప్రాపర్టీ షో’.
ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గృహ, రుణ వడ్డీ రేట్లు తగ్గడంతో, రుణాలు తీసుకుని ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వీటన్నింటికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. నగరం చుట్ట్టూ వివిధ కొత్త ప్రాజెక్టులు వస్తుండడం, ప్రభుత్వాలు కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుండడంతో, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
కొంపల్లి వైపు ఐటీ సంస్థల ఏర్పాటు, ఉప్పల్ వైపు మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయాలు, విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారి వైపు లాజిస్టిక్ పార్కులు, ఇలా నగరంలో నలు వైపులా డెవలప్మెంట్ ఊపందుకోవడంతో నగరానికి వలసలు పెరిగాయి ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహ నిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. ఎల్బీ నగర్ ప్రాంతానికి మెట్రో సౌకర్యం రావడంతో ఈ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో డిమాండ్ ఊపందుకుంది. అటు ఉప్పల్ వైపు కూడా మెట్రో రాకతో చాలా మంది ఇంటరెస్ట్ చూపుతున్నారు.
ప్రజలకు అన్ని వెంచర్స్ ఒకే వేదికపై తీసుకురావడంతో పాటు, బ్యాంకు లోన్స్ వివరాలు అక్కడికక్కడే తెలుసుకోవడానికి వీలుగా వివిధ బ్యాంక్స్ కూడా ఇక్కడ తమ స్టాల్ల్స్ ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇంకా ఇంటీరియర్ డెకొరేటర్స్, సోలార్, ఇతర గృహ సంబంధిత సంస్థలు కూడా తమ స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె