Price hike: సబ్సిడీలో కోత.. 1 నుంచి EVల ధరలకు రెక్కలు
Electric two wheelers: ఫేమ్-2 సబ్సిడీ కింద విద్యుత్ ద్విచక్ర వాహనదారులకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం కోత పెట్టింది. దీంతో ఆయా విద్యుత్ స్కూటర్ల ధరలు పెరగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ ద్విచక్ర వాహనాలకు (Electric two wheelers) ఇచ్చే సబ్సిడీలో (Subsidy) కేంద్రం కోత పెట్టింది. ఫేమ్-2 పథకం (FAME-II ) కింద ఇచ్చే రాయితీ మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఆ మేర విద్యుత్ వాహన ధరలు పెరగనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు విద్యుత్ వాహనాల కొనుగోలు భారం కానుంది. దీనిపై విద్యుత్ వాహన పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తుండగా.. మరికొన్ని స్టార్టప్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1 నుంచి తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయంచింది. ఫేమ్-2 పథకం కింద ఇస్తున్న సబ్సిడీని 1 kWhకు రూ.5,000 మేర తగ్గిస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంగళవారం నోటిఫికేషన్లో పేర్కొంది. గతంలో ఈ మొత్తం రూ.15 వేలుగా ఉండగా.. ఇకపై రూ.10,000కు తగ్గనుంది. అలాగే, ఒక్కో వాహనంపై గరిష్ఠ రాయితీ పరిమితి వాహన వ్యయంలో 40% వరకు పరిమితి ఉండగా.. ఇకపై ఆ మొత్తాన్ని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గననుంది. సవరించిన సబ్సిడీ 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని విద్యుత్ ద్విచక్ర వాహనాలకూ వర్తిస్తుందని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో వాహన ధరల పెరగనున్నాయి. సబ్సిడీ కోత ప్రభావం అటు కంపెనీలపైనా, ఇటు వినియోగదారులపైనా పడనుంది. ప్రస్తుతం 3kWh బ్యాటరీ కలిగిన ఒక విద్యుత్ స్కూటర్ ధర రూ.1 లక్ష అనుకుంటే.. సబ్సిడీ కింద ప్రస్తుతం రూ.40వేలు (గరిష్ఠ పరిమితికి 40 శాతానికి లోబడి) లభిస్తుంది. సవరించిన సబ్సిడీ మొత్తం అనంతరం ఈ మొత్తం కేవలం రూ.15వేలకే పరిమితం కానుంది. అంటే మిగిలిన రూ.25వేలు మొత్తం వినియోగదారుడే చెల్లించాలి. ఏథర్ వంటి సంస్థలు జూన్ 1 నుంచి ధరలు పెరగబోతున్నాయంటూ ఇప్పటికే తమ వెబ్సైట్లో బ్యానర్లను ప్రదర్శిస్తున్నాయి.
మరోవైపు పెరిగిన ధరల కారణంగా విద్యుత్ వాహనాలవైపు ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏథర్, ఓలా, టీవీఎస్ వంటి కంపెనీల సేల్స్పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్ వాహన తయారీదారుల సొసైటీ ఆందోళన వ్యక్తంచేసింది. సబ్సిడీలో కోత పెట్టడం వల్ల విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో స్టార్టప్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. విద్యుత్ వాహన పరిశ్రమ తన కాళ్లపై తాను నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొత్త మోడళ్లు
బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. -
టాటా ఎస్యూవీల్లో డార్క్ సిరీస్లు
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఎస్యూవీ బ్రాండ్లో డార్క్ సిరీస్లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. -
మార్కెట్లోకి BYD సీల్ EV.. 15 నిమిషాల ఛార్జింగ్తో 200km ప్రయాణం
BYD: చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ.. -
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. -
కొత్త ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ బైక్
మోటార్సైకిల్ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. -
మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్’ వేరియంట్ను గురువారం విడుదల చేసింది. -
భారత్లోకి కొత్త కవాసకి నింజా 500
ఇండియా కవాసకి మోటార్స్, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. -
kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్.. ధర రూ.9.29 లక్షలు
kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్ 900 పేరుతో కొత్త బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్
Hero MotoCorp: ప్రీమియం బైక్లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు. -
Ola Electric: ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు
Ola Electric: విద్యుత్ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి
ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. -
Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు
Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. -
ఈవీలపై టాటా మోటార్స్ డిస్కౌంట్.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు
Tata motors: టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. నెక్సాన్, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్