Price hike: సబ్సిడీలో కోత.. 1 నుంచి EVల ధరలకు రెక్కలు
Electric two wheelers: ఫేమ్-2 సబ్సిడీ కింద విద్యుత్ ద్విచక్ర వాహనదారులకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం కోత పెట్టింది. దీంతో ఆయా విద్యుత్ స్కూటర్ల ధరలు పెరగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ ద్విచక్ర వాహనాలకు (Electric two wheelers) ఇచ్చే సబ్సిడీలో (Subsidy) కేంద్రం కోత పెట్టింది. ఫేమ్-2 పథకం (FAME-II ) కింద ఇచ్చే రాయితీ మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఆ మేర విద్యుత్ వాహన ధరలు పెరగనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు విద్యుత్ వాహనాల కొనుగోలు భారం కానుంది. దీనిపై విద్యుత్ వాహన పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తుండగా.. మరికొన్ని స్టార్టప్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1 నుంచి తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయంచింది. ఫేమ్-2 పథకం కింద ఇస్తున్న సబ్సిడీని 1 kWhకు రూ.5,000 మేర తగ్గిస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంగళవారం నోటిఫికేషన్లో పేర్కొంది. గతంలో ఈ మొత్తం రూ.15 వేలుగా ఉండగా.. ఇకపై రూ.10,000కు తగ్గనుంది. అలాగే, ఒక్కో వాహనంపై గరిష్ఠ రాయితీ పరిమితి వాహన వ్యయంలో 40% వరకు పరిమితి ఉండగా.. ఇకపై ఆ మొత్తాన్ని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గననుంది. సవరించిన సబ్సిడీ 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని విద్యుత్ ద్విచక్ర వాహనాలకూ వర్తిస్తుందని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో వాహన ధరల పెరగనున్నాయి. సబ్సిడీ కోత ప్రభావం అటు కంపెనీలపైనా, ఇటు వినియోగదారులపైనా పడనుంది. ప్రస్తుతం 3kWh బ్యాటరీ కలిగిన ఒక విద్యుత్ స్కూటర్ ధర రూ.1 లక్ష అనుకుంటే.. సబ్సిడీ కింద ప్రస్తుతం రూ.40వేలు (గరిష్ఠ పరిమితికి 40 శాతానికి లోబడి) లభిస్తుంది. సవరించిన సబ్సిడీ మొత్తం అనంతరం ఈ మొత్తం కేవలం రూ.15వేలకే పరిమితం కానుంది. అంటే మిగిలిన రూ.25వేలు మొత్తం వినియోగదారుడే చెల్లించాలి. ఏథర్ వంటి సంస్థలు జూన్ 1 నుంచి ధరలు పెరగబోతున్నాయంటూ ఇప్పటికే తమ వెబ్సైట్లో బ్యానర్లను ప్రదర్శిస్తున్నాయి.
మరోవైపు పెరిగిన ధరల కారణంగా విద్యుత్ వాహనాలవైపు ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏథర్, ఓలా, టీవీఎస్ వంటి కంపెనీల సేల్స్పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్ వాహన తయారీదారుల సొసైటీ ఆందోళన వ్యక్తంచేసింది. సబ్సిడీలో కోత పెట్టడం వల్ల విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో స్టార్టప్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. విద్యుత్ వాహన పరిశ్రమ తన కాళ్లపై తాను నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా