Electric Vehicles: ఈవీలు వాడుతున్నారా.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Electric Vehicles: విద్యుత్తు వాహనాలకు తరచూ తనిఖీలు నిర్వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత ఎక్కువ కేర్ తీసుకోవాలి....
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్తు వాహనాల (Electric Vehicles)కు భారత్లో డిమాండ్ పెరుగుతోంది. 2021-22లో ఈవీల విక్రయాలు మూడింతలు పెరిగాయి. 2022లో ఇప్పటివరకూ నాలుగు లక్షలకు పైగా విక్రయాలు జరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 257 శాతం వృద్ధి నమోదైంది. భారత్లో ఈవీ (EV)లకు గిరాకీ పుంజుకుంటోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
విద్యుత్తు వాహనాల (Electric Vehicles)ని కొంటే సరిపోదు. వాటి నిర్వహణ తెలిసుండాలి. తరచూ తనిఖీలు చేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈవీ (EV)ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రత్యేక నిర్వహణ అవసరమవుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమస్యలకు పరిష్కారాలేంటో చూద్దాం..
షార్ట్ సర్క్యూట్..
వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు సహజం. విద్యుత్తు వాహనాలను (Electric Vehicles) ఛార్జ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్ పోర్ట్, ప్లగ్ వల్ల కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ సంభవించే అవకాశం ఉంది. ఇది లోపల సర్క్యూట్స్తో పాటు బ్యాటరీని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. నీళ్లు, తడి చేరని ప్రదేశాల్లో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఎప్పుడూ ఓ కవర్తో కప్పి ఉంచాలి. ఛార్జర్ ప్లగ్, పోర్టుని శుభ్రంగా ఉంచాలి. అవి తడవకుండా జాగ్రత్తపడాలి. భారీ ఉరుములు, మెరుపులు ఉన్న సమయాల్లో ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది!
పరికరాల్లోకి నీరు చేరడం..
వర్షాకాలంలో రోడ్లపై గుంతల్లో నీళ్లు నిలుస్తుంటాయి. అందులో నుంచి ఈవీ వెళ్లినప్పుడు పరికరాల్లోకి నీరు చేరుతుంటుంది. అయితే, బ్యాటరీ సహా ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే, దానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిధి దాటితే ప్రమాదం తప్పదు. సాధారణంగా ఈవీల్లోని బ్యాటరీ సహా ఇతర పరికరాలు ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ ప్రమాణంతో వస్తున్నాయి. అంటే ఈవీని నీటిలో ఒక మీటరు లోపల 30 నిమిషాల వరకు ఉంచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. వీలైనంత వరకు పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి ఉండే మార్గాల నుంచి వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరై వెళ్లినా.. వెంటనే తనిఖీ చేసుకొని తగు చర్యలు తీసుకోవాలి.
వైరింగ్ జాగ్రత్త..
ఈవీ (EV)ల్లో ఎలక్ట్రికల్ వైరింగ్ చాలా కీలకం. వాటిల్లో ఏమాత్రం డ్యామేజ్ జరిగినా ప్రమాదమే. వానాకాలంలో ఎలుకల వంటి చిన్న చిన్న జంతువులు వాహనాల్లోకి దూరే అవకాశం ఉంది. అవి గనక వైరింగ్ను కట్ చేస్తే ఇబ్బంది తప్పదు. వాహన పరికరాల్లోకి దుమ్ము చేరడం, గాల్లో తేమ, రోజుల తరబడి ముసుర్లు వర్షాకాలంలో సర్వసాధారణం. దీనివల్ల ఎలక్ట్రికల్ కనెక్టర్లు, వైర్లు తుప్పు పడుతుంటాయి. రంగు వేయని ఇతర భాగాలు సైతం దెబ్బతింటుంటాయి. ఈవీలను తడిచేరని ప్రదేశాల్లో పార్క్ చేయాలి. ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే ఎలుకలు వంటివి ఉండవు. కార్ల విషయానికి వస్తే అద్దాలను ఎప్పుడూ మూసి ఉంచాలి. లోపల తడి, తేమ లేకుండా చూసుకోవాలి. షెడ్లు, గ్యారేజ్లలో పార్క్ చేయాలి. వాటర్ప్రూఫ్ కవర్లను కప్పాలి.
బ్యాటరీ పనితీరు..
చాలా వరకు ఈవీ (EV)ల్లో లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగిస్తుున్నారు. బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వీటిలో వేడి పెరుగుతుంటుంది. తగ్గుతుంటుంది. వర్షాకాలంలో నిరంతరాయంగా వర్షాలు కురిసిన సమయంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతుంటాయి. అట్లాంటి సమయంలో బ్యాటరీ పనితీరు, దాని ఉష్ణోగ్రతపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఈవీని వినియోగించిన గంట తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి. ఫలితంగా బ్యాటరీ అప్పటికి చల్లబడుతుంది. ఈవీ వెంట వచ్చే ఒరిజినల్ ఛార్జర్లనే ఉపయోగించాలి. వీలైనంత వరకు స్లో ఛార్జింగ్కే మొగ్గుచూపాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత