Budget 2023: ఈవీలు వేగంగా రోడ్డెక్కాలంటే.. బడ్జెట్లో ఇవి ఉండాల్సిందే..!
Budget 2023: ఈవీ (Electric Vehicles) విక్రయాలు దేశంలో క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు పర్యావరణహిత ప్రయాణ సౌకర్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో సర్కార్ ఈ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణ మార్పులపై పోరు ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగం పెరుగుతోంది. 2022లో ఈవీ విక్రయాల్లో 210 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం భారత రోడ్లపై 14 లక్షలకు పైగా ఈవీ (Electric Vehicles)లు తిరుగుతున్నాయి. పర్యావరణహిత ప్రయాణ వసతులకు ప్రభుత్వం సైతం తనవంతుగా ప్రోత్సాహం అందిస్తోంది. అయినప్పటికీ.. సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహన విక్రయాలదే ఇప్పటికీ పైచేయి. ఈ నేపథ్యంలో ఈవీ (Electric Vehicles)ల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్ (Budget 2023)లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుంది? ఈవీ పరిశ్రమ కొత్త పద్దు నుంచి ఏం కోరుకుంటోంది?
జీఎస్టీ తగ్గించాల్సిందే..
విద్యుత్ వాహన (Electric Vehicles) పరిశ్రమ మొట్టమొదట జీఎస్టీ తగ్గించడానికి బడ్జెట్ (Budget 2023)లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ముఖ్యంగా జొమాటో, బిగ్బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలు డెలివరీ కోసం ఉపయోగించే ఈవీలపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పన్ను భారం తగ్గితే వచ్చే రెండేళ్లలో డెలివరీ వాహనాలన్నీ ఈవీలుగా రూపాంతరం చెందుతాయని జిప్ ఎలక్ట్రిక్ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ గుప్తా తెలిపారు.
మరోవైపు ఈవీ (Electric Vehicles)ల తయారీలో కీలకమైన బ్యాటరీలపైనా పన్ను తగ్గాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ ‘సెల్స్’ తయారీ భారత్లో ఊపందుకునే వరకు వీటి దిగుమతిపై సుంకం తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అలాగే విడిభాగాలను సైతం 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది.
బడ్జెట్ 2022- 23లో విద్యుత్తు (Electric Vehicles) వాహనాల ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఫేమ్-II పథకం కింద రూ.10,000 కోట్ల ఆర్థిక ప్రోత్సహకాలకు ప్రకటించింది. మరోవైపు తయారీని పెంచడం కోసం కంపెనీలకు రూ. 44,038 కోట్లు విలువ చేసే ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల (PLI)ను సైతం ప్రకటించింది.
వాణిజ్య వాహనాలనూ రోడ్లెక్కించాలి..
ఇప్పటి వరకు ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు కేవలం ప్రయాణికుల వాహనాలపైనే దృష్టి సారించాయి. ఇకపై వాణిజ్య వాహనాలను సైతం వేగంగా విద్యుత్ (Electric Vehicles) వైపుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం వాణిజ్య ఈవీల కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ విధానాల్లో పెద్ద వాహనాలు, ఫాస్ట్ ఛార్జింగ్ మౌలికవసతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇకపై వీటి ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు కోరుతున్నారు.
ఫేమ్-IIను పొడిగించాలి..
‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) రెండో దశ ప్రోత్సాహకాలను మరికొంత కాలం పొడిగించాలని ఈవీ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ సహా అన్ని విద్యుత్ వాహనాల (Electric Vehicles)కు కిలోవాట్కు రూ.15,000 చొప్పున డిమాండ్ ప్రోత్సాహాకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ద్విచక్రవాహనాల మొత్తం ధరలో రాయితీ పరిమితి 40 శాతంగా ఉంది. దీన్ని 2024 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయితీ నేరుగా వినియోగదారులకు అందేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఫేమ్-2ను దశలవారీగా లైట్ మోటార్, మీడియం, హెవీ వాహనాలు, ట్రాక్టర్లకు కూడా విస్తరించాలని కోరుతున్నారు.
ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు..
ఈవీల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న ప్రధాన అడ్డంకి ఛార్జింగ్ మౌలిక వసతులు. పెట్రోల్ పంపుల తరహాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా విరివిగా అందుబాటులోకి వస్తే ఈవీలను కొనడానికి ప్రజలు ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన మూలధన వ్యయంలో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
పన్ను ఆధారిత డిమాండ్లు..
ప్రస్తుతం విద్యుత్ వాహనాల (Electric Vehicles) కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీపై గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. 2023 మార్చి 31 వరకు తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించాలని కోరుతున్నారు. విద్యుత్ కార్లను కొనుగోలు చేసేవారికి కొనుగోలు చేసిన సంవత్సరంలోనే ఒకేసారి పన్ను మినహాయింపును ఇచ్చే విషయాన్ని కూడా పరిగణించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు