Electric vehicles: 2030 నాటికి భారత్లో 5 కోట్ల విద్యుత్తు వాహనాలు: కేపీఎంజీ
Electric vehicles: 2030 నాటికి భారత రోడ్లపై విద్యుత్తు వాహనాల సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తెలిపింది....
దిల్లీ: 2030 నాటికి భారత రోడ్లపై విద్యుత్తు వాహనాల (Electric vehicles - EV) సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తెలిపింది. ఛార్జింగ్ మౌలిక వసతుల రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మంచి గిరాకీ సహా విద్యుత్తు వాహన విక్రయాలకు దేశంలో అనుకూల వాతావరణం ఉందని తెలిపింది.
ఏడాది వ్యవధిలో భారత్లో విద్యుత్తు వాహనాల (Electric vehicles) అమ్మకాలు మూడింతలు పెరిగినట్లు కేపీఎంజీ వెల్లడించింది. బస్సు, ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాల్లో గణనీయ వృద్ధి నమోదవుతున్నట్లు తెలిపింది. మార్చి 2022 నాటికి భారత్లో ఈవీల సంఖ్య 10 లక్షలు దాటినట్లు పేర్కొంది. 2030 నాటికి ఈ సంఖ్య 4.5-5 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,700 పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపింది. ఈవీ రంగంలో నమోదవుతున్న వృద్ధికి ఇవి ఏమాత్రం సరిపోవని వివరించింది.
ఛార్జింగ్ మౌలిక వసతుల్ని పెంచడం కోసం ప్రభుత్వం బలమైన ప్రోత్సాహం అందజేస్తోందని కేపీఎంజీ తెలిపింది. ప్రజలు, ప్రైవేటు రంగాల నుంచి కూడా ఈవీలపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొంది. ఇది ఈవీ ఛార్జింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు దారితీస్తుందని తెలిపింది. ఛార్జింగ్ వ్యాపారం ద్విచక్ర వాహన విభాగంలో 2025 నాటికి 15-20 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2030కల్లా అది 50-60 శాతానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే వ్యక్తిగత ప్రయాణికుల వాహన విభాగంలో 2025 నాటికి 8-10 శాతం, 2030కల్లా 35-40 శాతం, నాలుగు చక్రాల వాణిజ్య వాహన విభాగంలో ఛార్జింగ్ వ్యాపారం 2030 నాటికి 90-95 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఛార్జింగ్ మౌలికవసతులకు ఉండే గిరాకీ ప్రత్యేకమైందని కేపీఎంజీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగు చక్రాల వాహనాల ఛార్జింగ్కు డిమాండ్ అధికంగా ఉందని వెల్లడించింది. అదే భారత్లో మాత్రం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఛార్జింగ్ ఎక్కువ అవసరమని తెలిపింది. పెద్ద పెద్ద పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కంటే ముందు స్వల్పకాలంలో ఇళ్లు, కార్యాలయాల వంటి స్థలాల్లో తాత్కాలిక ఏర్పాట్లు మంచి ఫలితాన్నిస్తాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొత్త మోడళ్లు
బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. -
టాటా ఎస్యూవీల్లో డార్క్ సిరీస్లు
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఎస్యూవీ బ్రాండ్లో డార్క్ సిరీస్లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. -
మార్కెట్లోకి BYD సీల్ EV.. 15 నిమిషాల ఛార్జింగ్తో 200km ప్రయాణం
BYD: చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ.. -
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. -
కొత్త ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ బైక్
మోటార్సైకిల్ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. -
మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్’ వేరియంట్ను గురువారం విడుదల చేసింది. -
భారత్లోకి కొత్త కవాసకి నింజా 500
ఇండియా కవాసకి మోటార్స్, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. -
kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్.. ధర రూ.9.29 లక్షలు
kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్ 900 పేరుతో కొత్త బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్
Hero MotoCorp: ప్రీమియం బైక్లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు. -
Ola Electric: ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు
Ola Electric: విద్యుత్ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి
ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. -
Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు
Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. -
ఈవీలపై టాటా మోటార్స్ డిస్కౌంట్.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు
Tata motors: టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. నెక్సాన్, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. -
Maruti Suzuki: ఎర్రసముద్రం అలజడితో వ్యయాలు పెరగొచ్చు: మారుతీ సుజుకీ
Maruti Suzuki: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడుల వల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?