Elon Musk: మాజీ ఉద్యోగికి సారీ చెప్పిన ఎలాన్ మస్క్.. ఎందుకంటే?
Elon Musk: ఓ ఉద్యోగి గురించి వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా తాను మాట్లాడానని ఎలాన్ మస్క్ తెలిపారు. అందుకు తనని క్షమించాలని ఆయన్ని కోరారు.
వాషింగ్టన్: ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ మాజీ ట్విటర్ ఉద్యోగితో ఆయన చేసిన చాట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా మాట్లాడానని.. అందుకు క్షమించాలని సదరు ఉద్యోగిని మస్క్ (Elon Musk) కోరారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
వ్యయ నియంత్రణలో భాగంగా ట్విటర్లో చాలా మంది ఉద్యోగుల్ని మస్క్ (Elon Musk) తొలగించారు. అందులో హరాల్దుర్ థోర్లీఫ్సన్ (ట్విటర్లో హల్లీ పేరిట అకౌంట్ నిర్వహిస్తున్నారు) అనే వ్యక్తి కూడా తన ఉద్యోగం కోల్పోయారు. అయితే, ఆయన కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. వ్యక్తిగత పనులను కూడా ఆయనకు ఇతరుల సాయం అవసరమవుతుంది. కచ్చితంగా వీల్ఛైర్ కావాల్సిందే. అయితే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసి కూడా ఉద్యోగం నుంచి తొలగించడంపై థోర్లీఫ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనని తొలగించిన తీరు, ఆఫర్ చేసిన పరిహార ప్యాకేజీ పైనా ట్విటర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన మస్క్ (Elon Musk).. కంపెనీకి థోర్లీఫ్సన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలా కటువుగా చెప్పారు. పైగా ఇప్పటికే వ్యక్తిగతంగా చాలా ఆస్తులు ఉన్న ఆయన భారీ పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అయితే, మస్క్ (Elon Musk) వ్యాఖ్యలపై థోర్లీఫ్సన్ తిరిగి దీటుగా జవాబిచ్చారు. తాను శారీరక లోపం వల్ల కదల్లేకపోతున్నానని పేర్కొన్నారు. కానీ, మస్క్ మాత్రం భౌతికంగా దృఢంగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ సాయం లేకుండా వాష్రూంకి కూడా వెళ్లడంలేదని చెప్పారు. మస్క్ (Elon Musk) ఆఫీసులో నిత్యం సెక్యూరిటీతో ఉంటున్నారని ఓ ఉద్యోగి తెలిపినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు వాష్రూంకు వెళ్లే సమయంలోనూ వారు ఆయన వెంట వెళుతున్నారని సమాచారం.
అయితే, థోర్లీఫ్సన్ పరిస్థితి తనకు పూర్తిగా తెలియదని మస్క్ (Elon Musk) తాజాగా తెలిపారు. ఆయన గురించి చెప్పినవారు తనకు పరిస్థితిని సరిగా వివరించలేకపోయారని పేర్కొన్నారు. అందువల్లే తప్పు దొర్లిందని.. తాను అపార్థం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. థోర్లీఫ్సన్పై తాను చేసిన వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో పోస్ట్లకు ఫీజు.. బాట్ల నివారణకు మస్క్ కొత్త ప్లాన్!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
నష్టాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్లు నష్టపోయి 73,063 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 86 పాయింట్లు కుంగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా పేదరికం పోదు
ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు మన దేశం 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ, పేద దేశంగానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
మన నగరాల్లో టెస్లా షోరూంలు!
అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. -
యుద్ధ మేఘాల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు సోమవారం దేశీయ సూచీలూ బెంబేలెత్తాయి. మదుపర్లు స్థిరంగా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. -
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల్లో దిల్లీ
ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల (బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023) జాబితాలో దిల్లీ విమానాశ్రయం (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) పదో స్థానంలో నిలిచింది. -
రూ.349కే విమాన ప్రయాణం
రూ.349 ఛార్జీతో విమానంలో ప్రయాణించొచ్చని మీకు తెలుసా.. అసోంలోని లిలాబరి నుంచి తేజ్పూర్ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. -
3 నెలల గరిష్ఠానికి టోకు ధరలు
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో స్వల్పంగా పెరిగి 0.53 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్ఠం. కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లి, ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
ఆఫర్ లెటర్లున్న అందరికీ ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 2023-24 తరహాలోనే 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ, ఎండీ కృతివాసన్ స్పష్టంచేశారు. -
వస్తువుల ఎగుమతులు 3.11% తగ్గాయ్
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల, మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్ డాలర్ల (సుమారు రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది. -
బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా
బైజూస్ బ్రాండ్పై సేవలందించే ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ భారత కార్యకలాపాలకు సీఈఓగా ఉన్న అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయ వ్యాపారాలకు సీఈఓగా గతేడాది జులైలో బైజూస్లోకి మోహన్ చేరారు. -
ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ.10,000 వరకు తగ్గింపు
ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభ స్థాయి స్కూటర్ ‘ఎస్1 ఎక్స్’ ధరను రూ.5000- 10,000 వరకు తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్1 ఎక్స్ స్కూటర్ను మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
మలివిడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) అనంతరం 6-9 నెలల్లో, కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని వొడాఫోన్ ఐడియా (వీఐ) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్’ - చట్టసభ సభ్యుల ఆందోళన
-
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
-
ఆర్సీబీని విక్రయించాలంటున్న టెన్నిస్ స్టార్.. బ్యాటర్ల విధ్వంసంపై సచిన్ ఆసక్తికర పోస్టు
-
శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీకి జైలు శిక్ష
-
జనసేనకు హైకోర్టులో ఊరట.. గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
-
భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు