Twitter: మస్క్ బృందంలో భారతీయుడు.. ఎవరీ కృష్ణన్?
Twitter: ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఇద్దరు భారత సంతతికి చెందిన కీలక వ్యక్తుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మరో భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్కు కీలక బాధ్యతలు అప్పగించారు.
న్యూయార్క్: ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా లీగల్ హెడ్ విజయ గద్దె, మరికొందరు ప్రముఖుల తొలగింపుతో ఆయన తన కార్యాచరణను మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది కీలక వ్యక్తులు ట్విటర్లో మార్పులపై మస్క్కు సాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలోనూ భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
సిలికాన్ వ్యాలీలో ప్రముఖ టెక్ నిపుణుడిగా పేరొందిన శ్రీరామ్ కృష్ణన్ మస్క్కు సలహాలిస్తున్న వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘మరికొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి ట్విటర్లో ఎలాన్ మస్క్కు తాత్కాలికంగా సాయం చేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన సంస్థగా నేను భావిస్తున్నాను. ప్రపంచంపై చాలా ప్రభావం చూపుతుందని విశ్వసిస్తున్నాను. ఎలాన్ మస్కే దీనికి సరైన వ్యక్తి’’ అని కృష్ణన్ అన్నారు.
చెన్నై కుర్రాడే..
కృష్ణన్ ఆయన సతీమణి ఆర్తీ రామమూర్తి చెన్నైలోనే పుట్టి పెరిగారు. గత ఏడాది జులైలో న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం.. వీరిది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. వీరివురు 2003లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో కలిశారు. ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. 2010లో వీరు అమెరికాకు వెళ్లారు.
టెక్ దిగ్గజాలతో..
ప్రస్తుతం కృష్ణన్ సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆండ్రిసెన్ హోరోవిట్జ్ (a16z)లో భాగస్వామిగా ఉన్నారు. ప్రాథమిక దశలో ఉన్న అంకుర సంస్థల్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో బిట్స్కీ, హోపిన్, పాలీవర్క్ కంపెనీ బోర్డుల్లో కృష్ణన్ సభ్యుడిగానూ ఉన్నారు. ఏ16జెడ్లో చేరడానికి ముందు ఆయన పలు టెక్ కంపెనీల్లో కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఇటీవలి వరకు ట్విటర్లో హోం టైమ్లైన్, న్యూ యూజర్ ఎక్స్పీరియెన్స్, సెర్చ్, డిస్కవరీ, ఆడియెన్స్ గ్రోత్ వంటి ప్రొడక్ట్లకు సంబంధించిన బృందాలకు నేతృత్వం వహించారు. అంతకుముందు స్నాప్, ఫేస్బుక్కు సంబంధించిన పలు మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
మైక్రోసాఫ్ట్తో కృష్ణన్ తన టెక్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విండోస్ అజూర్కు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ‘ప్రోగ్రామింగ్ విండోస్ అజూర్’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రముఖ ఆడియో యాప్ క్లబ్హౌస్లో సతీమణి ఆర్తీ రామమూర్తితో కలిసి ‘ది గుడ్ టైమ్స్ షో’ అనే షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ బామర్ వంటి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు