Elon Musk: మస్క్ రూటే సెపరేటు.. అమ్మనన్నారు.. కానీ, అమ్మేశారు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల దాదాపు ఏడు బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు...
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల దాదాపు ఏడు బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా (Tesla) షేర్లను విక్రయించారు. ఈ విషయం రెగ్యులేటరీ ఫైలింగ్స్ ద్వారా వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్విటర్ కొనుగోలు ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.
టెస్లా సీఈఓగా ఉన్న మస్క్ (Elon Musk) కంపెనీలో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు. గత శుక్రవారం నుంచి ఈ మంగళవారం మధ్య ఆయన దాదాపు 7.9 మిలియన్ల షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ వివరాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన వాటా 15 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా మస్క్ టెస్లా షేర్లను పలు దఫాల్లో విక్రయిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 32 బిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ట్విటర్ కొనుగోలు నిమిత్తం ఏప్రిల్లోనే ఏకంగా 8.5 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను అమ్మారు. మరిన్ని షేర్లను విక్రయించబోనని ఆ సమయంలో మస్క్ చెప్పడం గమనార్హం.
ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ వెనక్కి మళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై అక్టోబరులో విచారణ జరగనుంది. ఒకవేళ న్యాయస్థానం ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆదేశిస్తే.. మస్క్కు 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమవుతుంది. ఇప్పటికే మస్క్కు ట్విటర్లో తొమ్మిది శాతం వాటాలున్నాయి. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా ఒక్కో షేరు విలువను 54.20 డాలర్లుగా లెక్క కడితే.. మస్క్ వాటా విలువ నాలుగు బిలియన్ డాలర్లు.
‘‘షేర్లను విక్రయించడం ఇక ముగిసినట్లేనా?’’ అని ట్విటర్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్.. ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చారు. ఏప్రిల్లోనూ ఇలాగే సమాధానం ఇవ్వడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ‘‘ఒకవేళ ట్విటర్ ఒప్పందం కచ్చితంగా పూర్తి చేయాల్సి వచ్చి.. ఈక్విటీ భాగస్వాములెవరైనా తనతో కలిసి రాకపోతే అత్యవసరంగా టెస్లా షేర్లను విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం’’ అని మస్క్ చెప్పారు. ఒకవేళ ట్విటర్ డీల్ విషయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం రాకపోతే.. టెస్లా షేర్లను మళ్లీ కొనుగోలు చేస్తానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM