Elon Musk: నష్టాల్లో ‘గిన్నిస్ రికార్డు’ సృష్టించి.. ప్రపంచ కుబేరుల జాబితాలో దిగజారి..!
ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్.. ఇటీవలే ఆ జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయారు. ఏడాది వ్యవధిలోనే సుమారు 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా చరిత్రలో అత్యంత సంపద నష్టపోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అనతికాలంలో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ (Elon Musk).. అంతే వేగంగా తన సంపద కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన వ్యక్తిగత ఆస్తులు భారీగా క్షీణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)’ ప్రకటించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఒక్క ఏడాది వ్యవధిలోనే (2021-2022) దాదాపు 182 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైందని అంచనా. ఇతర నివేదికలను బట్టి చూస్తే ఈ నష్టం వాస్తవానికి 200 బి.డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. చరిత్రలో ఏ సంపన్నుడూ ఈ స్థాయి నష్టాన్ని చవిచూడలేదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.
ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. ప్రపంచంలోనే సంపన్న వ్యక్తిగా నిలిచిన మస్క్ సంపద 2021లో 320బి.డాలర్లుగా ఉంది. తాజాగా (2023 జనవరి) అది 138 బి.డాలర్లకు పడిపోయింది. అయితే, ఆయన సంపదలో కచ్చితంగా ఎంత మేరకు నష్టపోయారనే విషయాన్ని అంచనా వేయలేకున్నప్పటికీ.. ఏడాది వ్యవధిలోనే 182 బి.డాలర్ల నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 58.6 బి.డాలర్ల నష్టంతో రికార్డు నెలకొల్పిన ఆయన.. తాజాగా తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. ఇలా భారీగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు (GWR) ఇటీవల వెల్లడించింది. కొంతకాలంగా సంపద ఆవిరవుతోన్న తీరుపై స్పందించిన మస్క్.. ‘దీర్ఘకాలపు సిద్ధాంతాలు బలంగా ఉంటాయి. స్వల్ప కాలిక మార్కెట్లు మాత్రం ఊహించలేం’ అని పేర్కొంటూ గతేడాది మార్కెట్లు ముగింపు రోజున (డిసెంబర్ 30) ట్వీట్ చేశారు.
ఎలాన్ మస్క్ ఆస్తులు అత్యధికంగా టెస్లా స్టాక్స్ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల ఆ సంస్థ షేర్లు భారీగా పతనం అవడంతోపాటు చాలా షేర్లను మస్క్ విక్రయిస్తున్నారు. ఇలా ఒక్క 2022లోనే వాటి షేర్లు 65శాతం క్షీణించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆస్తుల విలువ తగ్గినప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా టెస్లానే కొనసాగుతుండటం విశేషం. మరోవైపు చరిత్రలోనే అత్యంత సంపద కోల్పోయిన వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సుమారు 198బి.డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా