Elon Musk: ఎలాన్ మస్క్ సొంత సోషల్ మీడియా ప్రారంభించనున్నారా?
Elon Musk: తాజాగా ఎలాన్ మస్క్ ఇచ్చిన ఓ సమాధానంతో ఆయన సొంత సోషల్ మీడియా ప్రారంభించనున్నారనే చర్చ జరుగుతోంది...
వాషింగ్టన్: ట్విటర్లో యాక్టివ్గా ఉండే టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ తరచూ తన పోస్టులతో యూజర్లను గందరగోళానికి గురిచేస్తుంటారు. ఆయన పెట్టిన సందేశాల వెనుక అర్థమేంటో తెలుసుకోవడానికి ఒక్కోసారి బుర్ర గోక్కోవాల్సి వస్తుంటుంది! తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అలాంటి పరిస్థితికే దారి తీసింది.
ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అయితే, ‘‘ఒకవేళ ట్విటర్ డీల్పై ముందుకెళ్లకపోతే.. మరో కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తారా?’’ అని ఓ యూజర్ ట్విటర్లో మస్క్ను ప్రశ్నించారు. దీనికి ఆయన ‘ఎక్స్.కామ్ (X.com)’ అంటూ ఒకే పదంతో సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మస్క్ ఈ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారా? అనే చర్చకు తెరలేచింది.
ట్విటర్ కొనుగోలు ఒప్పందం ఖరారు చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా మస్క్ ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘కొత్త సోషల్ మీడియా వేదికను ఏమైనా ఏర్పాటు చేస్తారా?’’ అని మార్చి ఆరంభంలో ఓ యూజర్ ప్రశ్నించారు. మస్క్ సమాధానమిస్తూ.. ‘‘దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నాను’’ అని బదులిచ్చారు. దీంతో ఆయన కొత్త సోషల్ మీడియాను ప్రారంభించనున్నారని అప్పట్లో తెగ చర్చ జరిగింది. కానీ, కొన్ని రోజులకే ట్విటర్ కొనుగోలు ప్రతిపాదనను ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
డొమైన్ ఎక్స్.కామ్ అనేది మస్క్కి కొత్తేమీ కాదు. ఇది గతంలో ఆయన నిర్వహించి తర్వాత పేపాల్లో విలీనం చేసిన ఓ ఆర్థిక సేవల సంస్థకు చెందినది. ఈ ‘డొమైన్ నేమ్’ను తిరిగి 2017లో పేపాల్ నుంచి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డొమైన్ యాక్టివ్లోనే ఉంది. కానీ, అందులో ఎలాంటి సమాచారం లేదు. దీనిపై క్లిక్ చేస్తే తెల్లటి బ్యాక్గ్రౌండ్ పైభాగంలో కుడిపక్కన ఎక్స్ అనే అక్షరం ఒక్కటే కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)