Elon Musk: మస్క్ సంపద మరింత పతనం.. ఒక్కరోజే ₹63.72 వేల కోట్లు ఆవిరి!
టెస్లా షేర్లు (Tesla Shares) మంగళవారం భారీగా పతనమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయిన మస్క్ (Elon Musk) సంపద మరింత దిగజారింది.
వాషింగ్టన్: టెస్లా, ట్విటర్, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని కోల్పోయారు. ఆయన సంపద ఇంకా తరిగిపోతూనే ఉండడం గమనార్హం. మంగళవారం టెస్లా షేర్ల (Tesla Shares)లో భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో మస్క్ (Elon Musk) సంపదలో 7.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. అక్టోబరు తర్వాత టెస్లా షేర్లు మంగళవారం అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని నమోదు చేశాయి.
ఈ ఏడాది మస్క్ సంపద ఇప్పటి వరకు 122.6 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. 2021లో ఆయన సంపాదించిన దానికంటే ఇది ఎక్కువ. గత ఏడాది ఆయన ప్రపంచంలోనే అత్యధిక సంపద కూడగట్టుకున్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం మస్క్ సంపద ఇప్పుడు 148 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రెండేళ్ల కనిష్ఠం. ప్రస్తుతం ఆయన కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 161 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత భారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
మస్క్ సంపదలో అత్యధికంగా టెస్లా స్టాక్స్, ఆప్షన్స్ రూపంలోనే ఉంది. అక్టోబరులో ట్విటర్ను సొంతం చేసుకున్న ఆయన.. దానికి కావాల్సిన నిధుల కోసం టెస్లా షేర్లను విక్రయించారు. ఇటీవలే 3.58 బిలియన్ డాలర్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. దానికి కారణం వెల్లడించనప్పటికీ.. ట్విటర్ కొనుగోలు బకాయిలు చెల్లించడానికే అయి ఉంటుందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తన సమయంలో ఎక్కువ భాగాన్ని దాని కోసమే వెచ్చిస్తున్నారన్న ఆందోళన వాటాదారుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయన టెస్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భయం వారిలో బలపడుతోంది. పైగా ట్విటర్లో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడంతో ఆ ప్రభావం కూడా టెస్లా బ్రాండ్ విలువపై ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలే షేరు విలువ దిగజారడానికి కారణమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.