Evergrande: చైనాలో ఆగని గృహ సంక్షోభ ప్రకంపనలు..!
చైనాలోని దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్గ్రాండ్ మార్కెట్ విలువ మరోసారి భారీగా పతనమైంది. రెండు రోజుల్లో సంస్థ షేర్లు 25శాతం విలువ కోల్పోయాయి. మరో వైపు రుణ పునర్ వ్యవస్థీకరణ సంక్లిష్టంగా మారిందని సంస్థ పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: చైనా(China)లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్గ్రాండ్ (Evergrande) సమస్యల నుంచి బయటపడే అవకాశం కనుచూపు మేరలో లేదు. ఆ కంపెనీకి చెందిన హెంగ్డా రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 547 మిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో గత రెండు రోజుల్లో ఎవర్గ్రాండ్ షేర్లు నాలుగోవంతు విలువ కోల్పోయాయి. అంతేకాదు.. ఇటీవల చైనా అధికారులు ఎవర్గ్రాండ్ ప్రస్తుత, మాజీ అధికారులను అదుపులోకి తీసుకొన్నట్లు స్థానిక వార్తా సంస్థ ఒకటి కథనం వెలువరించింది. వీరిలో కంపెనీ మాజీ సీఈవో షియా హజున్, ఫైనాన్స్ విభాగం మాజీ అధిపతి పెన్ డారోంగ్ ఉన్నట్లు వెల్లడించింది.
ఆదివారం ఎవర్ గ్రాండే సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజికి కీలక సమాచారాన్ని అందించింది. తమ అనుబంధ సంస్థ అయిన హెంగ్డా రియల్ ఎస్టేట్పై అధికారులు దర్యాప్తు చేపట్టారని పేర్కొంది. దీంతో తమ రుణ పునర్ వ్యవస్థీకరణ ప్లాన్ అనుకున్నట్లు సాగే పరిస్థితి లేదని వెల్లడించింది.
మస్క్ పేరు మార్చుకుంటున్నారా..?చర్చకు దారితీసిన తాజా పోస్టు
ఈ నెల మొదట్లో ఎవర్గ్రాండ్కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగం ఉద్యోగులను షెంజన్ నగరంలో చైనా అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థలో వీరు మోసాలకు పాల్పడటంతోనే అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవర్గ్రాండ్ చెందిన బీమా విభాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలోకి తీసుకొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంపెనీ రుణ పునర్వ్యవస్థీకరణ క్లిష్టంగా మారింది. ఇప్పటికే ఈ కంపెనీపై దాదాపు 300 బిలియన్ డాలర్ల రుణం ఉంది. దీనిలో చాలా వరకు చైనాలో సాధారణ ప్రజల నుంచి సేకరించిన మొత్తమే. చైనా బయట నుంచి సేకరించిన రుణాల మొత్తం కేవలం 31 బిలియన్ డాలర్లు మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
QR code scams: తరచూ క్యూఆర్కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. -
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
గోఫస్ట్ కథ కంచికేనా?
దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్.. ఇక ఎగరకపోవచ్చు. -
ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధం
నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్ ఇంక్., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. -
కార్లు, బైక్లకు భలే గిరాకీ
ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. -
కొనసాగిన రికార్డుల పరుగు
వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. -
తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మిగ్జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్వ్యాగన్ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. -
ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. -
పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్ 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం వెల్లడించారు. -
సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. -
రతన్ టాటా పేరుతో ‘ఫేక్’ సిఫారసులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తూ.. వచ్చిన ‘ఫేక్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇచ్చింది. -
1,14,902 అంకురాలకు గుర్తింపు
పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్లో 8% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
-
Hyderabad: మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
-
Revanth Reddy: నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్