Layoffs: ప్రతి నలుగురిలో ఒకరికి లేఆఫ్ భయం..
ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్లో ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతుందనే భయాందోళనకు గురవుతున్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది.
దిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇప్పుడు దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్ల (Layoffs) బాట పడుతున్నాయి. కంపెనీ వ్యయాల్లో అధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలే కావడంతో భారీ సంఖ్యలో కోతలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందేమోనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు లేఆఫ్ల గురించి భయపడుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఇక, మిగతా ముగ్గురు ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.
దేశ బడ్జెట్ (Union Budget 2023)పై మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కాంటార్ (Kantar) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై సర్వే నిర్వహించగా.. మెజార్టీ ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. 2023లో ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతుందని 50శాతం మంది విశ్వసిస్తున్నారు. 31శాతం మాత్రం వృద్ధి నెమ్మదిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక మందగమనం, కొవిడ్ ముప్పు మళ్లీ తప్పదేమో అనే అంచనాలపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ధరల పెరుగుదలపై కలవరపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రాబోయే బడ్జెట్ (Budget 2023)లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు. ఇక, ప్రతి నలుగురిలో ఒకరు లేఆఫ్ ముప్పు గురించి భయపడుతున్నారు’’ అని సర్వే వెల్లడించింది.
ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారా?
ఇక, వచ్చే బడ్జెట్లో ఆదాయపు పన్ను (Income Tax)లో విధానపరమైన మార్పులకు ప్రకటనలు వెలువడే అవకాశముందని అధిక మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో తేలింది. ‘‘ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (ప్రస్తుతం రూ.2.5లక్షల వరకు ఉంది)ని పెంచొచ్చని చాలా మంది ఆశాభావంతో ఉన్నారు. వేతన జీవుల్లో 42శాతం మంది పరిమితి పెంచే అవకాశాలున్నాయని చెప్పారు’’ అని కాంటార్ సర్వే వెల్లడించింది. ఇక, 80సీ చట్టం కింద పెట్టుబడులకు పన్ను రిబేట్ను పెంచాలని 2/3 వంతుల మంది కోరుకుంటున్నారని తెలిపింది.
ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో 2022 డిసెంబరు 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకు కాంటార్ ఈ సర్వే చేపట్టింది. 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు గ్రూప్ వారి నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)