Womens Day: ఈ పథకాలు మహిళల కోసమే.. వీటి గురించి తెలుసా?
Women's day: మహిళల ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక పథకాలను తీసుకొచ్చింది. వాటి గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా పురుషులే చూసుకోవాలనే ఆలోచనలకు కాలం చెల్లింది. కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. ఆర్థికంగా ఇంటిని సరిదిద్దడంలో ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళల సాధికారత (Women Empowerment) కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వారి ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. కానీ, చాలా మందికి అవేంటో తెలియదు. వీటిపై అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సి ఉంది.
పొదుపు ఖాతాల్లో మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు..
సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫీచర్లతో పాటు మహిళల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్లు ప్రత్యేక ప్రయోజనాలను అందజేస్తాయి. మహిళల ఆర్థిక సాధికారితకు అనుగుణంగా ఆయా ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సవరిస్తుంటాయి. అలాగే ప్రత్యేక సందర్భాల్లో రాయితీలు, రివార్డులు కూడా అందజేస్తాయి. షాపింగ్, ఫుడ్, వెల్నెస్, ఎంటర్టైన్మెంట్లోనూ ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. రుణరేట్లలోనూ కొంత రాయితీనిస్తాయి. మరోవైపు పిల్లల కోసం మహిళలు ప్రత్యేకంగా జూనియర్ అకౌంట్ తెరిచే అవకాశం కూడా ఉంటుంది. పైగా సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిప్ చేసినవారికి కొన్ని బ్యాంకులు ‘మంత్లీ మినిమం బ్యాలెన్స్’ నిబంధనలను వర్తింపజేయడం లేదు.
తక్కువ బీమా ప్రీమియం..
కుటుంబం కోసం నిరంతరం శ్రమించే మహిళల భద్రత కోసం బీమా తప్పనిసరి. వారు కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలా ప్రోత్సహించడం కోసం బీమా కంపెనీలు ప్రీమియంలో తగ్గింపునిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే ఆరోగ్య, జీవిత బీమా పాలసీ ప్రీమియంలు మహిళలకు తక్కువగా ఉంటాయి.
తక్కువ వడ్డీరేటుతో రుణాలు..
చాలా వరకు బ్యాంకులు మహిళలకు ఇచ్చే లోన్లపై వడ్డీరేటులో రాయితీనిస్తాయి. సందర్భాన్ని బట్టి 0.05% నుంచి 0.5% వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. ముఖ్యంగా గృహరుణాల్లో ఈ ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడిగా తీసుకునే రుణాల్లో ప్రధాన దరఖాస్తుదారుగా మహిళ ఉన్నా కూడా వడ్డీరేటు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు కారు లోన్లపై కూడా మహిళలకు వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. కేవలం వడ్డీరేటులో రాయితీ మాత్రమే కాదు.. ప్రాసెసింగ్ ఫీజులోనూ ఒక్కోసారి మినహాయింపు ఉంటుంది.
మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక పథకాలు..
మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి భారతీయ మహిళా బ్యాంకు వ్యాపార రుణాలను అందిస్తోంది. మహిళల నేతృత్వంలో నడిచే తయారీ కంపెనీలకు ఈ స్కీం కింద రూ.20 కోట్ల వరకు రుణాన్నిస్తారు. వడ్డీరేటు 10.15 శాతం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకైతే రూ.1 కోటి వరకు ఎలాంటి తనఖా లేకుండానే లోన్ అందజేస్తారు.
అన్నపూర్ణ స్కీమ్..
ఫుడ్ కేటరింగ్ బిజినెస్ స్థాపించే మహిళల కోసం ప్రభుత్వం అన్నపూర్ణ స్కీం పేరిట రూ.50 వేల వరకు రుణాలందిస్తోంది. వీటితో కావాల్సిన వంటపాత్రలు సహా ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాంకు, ప్రాంతం బట్టి వడ్డీరేటు మారుతుంది. దీన్ని మూడేళ్లలో తిరిగి చెల్లించేయాలి. అలాగే TREAD (Trade-Related Entrepreneurship Assistance and Development) అనే స్కీమ్ ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది.
వర్కింగ్ విమెన్ హాస్టల్..
ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వర్కింగ్ విమెన్ హాస్టల్స్ స్కీమ్ను తీసుకొచ్చింది. వారి పిల్లల సంరక్షణకు కూడా ఈ హాస్టల్స్లో ఏర్పాట్లు ఉంటాయి. నెలవారీ ఆదాయం రూ.50,000 కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
మహిళా శక్తి కేంద్రాలు..
మహిళల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కావాల్సిన నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా ఆయా ప్రాంతాల్లో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎస్ఎస్వైతో బాలికల భవిష్యత్ బంగారం..
సుకన్య సమృద్ధి ఖాతా అనేది బాలికల కోసం ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకంపై వడ్డీ ప్రస్తుతం 7.60% లభిస్తుంది. బాలికలకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఖాతాను తెరవొచ్చు. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే తెరవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇద్దరు బాలికల వరకు ఖాతా తెరిచే అనుమతి ఉంటుంది. ఖాతాను పోస్టాఫీసు లేదా అనుమతి ఉన్న బ్యాంకుల శాఖలలో తెరవొచ్చు. ఖాతాను తెరిచేటప్పుడు బాలిక జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఖాతాను భారతదేశం అంతటా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. ఖాతా 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది.
మహిళా-ఈ-హాత్..
కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా-ఈ-హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా-ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎస్బీఐ స్త్రీ శక్తి స్కీమ్..
వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఎస్బీఐ రూ.50 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని అందజేస్తోంది. అయితే, వ్యాపారంలో మహిళలకు కనీసం 50 శాతం వాటా ఉండాలి. ఐదు లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేదు. దరఖాస్తుదారు క్రెడిట్ హిస్టరీ, బిజినెస్ అసవరాలను బట్టి వడ్డీరేటు మారుతుంటుంది. ఏడాది నుంచి ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఓరియెంట్ మహిళా వికాస్ యోజన స్కీం..
ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళల కోసం ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. రూ.25 లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేదు.
వీటితో పాటు ముద్రా లోన్, డేనా శక్తి స్కీమ్, మహిళా ఉద్యమ్ నిధి యోజన, సెంట్ కల్యాణి యోజన, ఉద్యోగిని స్కీమ్, ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన, సింధ్ మహిళా శక్తి స్కీమ్ వంటి పథకాలు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మహిళలకు సహకారాన్ని అందిస్తున్నాయి.
భారతీయ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక విషయాల్లోనూ ఎంతో నేర్పుగా వ్యవహరిస్తున్నారు. ఇంటి ఆర్థిక విషయాలకే పరిమితం కాకుండా.. పొదుపు, పెట్టుబడుల్లాంటి అంశాల్లోనూ ఇప్పుడు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM