Budget 2023: వేతన జీవుల వెతలు.. బడ్జెట్లో దొరికేనా ఉపశమనం..?
Budget 2023: బడ్జెట్ 2023పై వేతనజీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు. తొలగింపులు, మూన్లైటింగ్ వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర బడ్జెట్ 2023కి (Budget 2023) కాలం సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2022లో ఉద్యోగులకు కష్టంగానే గడిచింది. తొలగింపులు, వర్క్ ఫ్రమ్ హోం నుంచి తిరిగి ఆఫీసులకు వెళ్లడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల వంటి పరిణామాలు వేతన జీవులను ఆందోళనకు గురిచేశాయి. వీటిలో కొన్ని ఇబ్బందులు ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2023)లో వేతనజీవుల వెతలను కాస్తయినా తగ్గించే ప్రకటనలు ఉండాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగ కల్పనపై దృష్టి..
ప్రైవేటు సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి (Layoffs). మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో కొత్త నియామకాలు సైతం నిలిచిపోతున్నాయి. మరోవైపు ధరలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ (Budget 2023)లో ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అసవరం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచి వృద్ధికి ఊతమివ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశాలను పరిశీలించాలి. గ్రామీణ, టైర్-2, టైర్-3, టైర్-4 ప్రాంతాల్లోని మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులను పెంచాలి.
కంపెనీలకు ప్రోత్సాహకాలు..
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80జేజేఏఏ ప్రకారం.. అదనంగా నియమించుకున్న ఉద్యోగుల ఖర్చులపై పన్ను మినహాయింపు పొందేందుకు కంపెనీలకు అవకాశం ఉంది. దీంట్లోని పరిమితుల్ని తొలగించి మరింత ఎక్కువ మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించేలా ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు. మరోవైపు అంకుర సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారానూ ఉద్యోగ కల్పనకు కృషి చేయొచ్చు.
నిబంధనలు కట్టుదిట్టం..
ఉద్యోగులను సంస్థలు అర్ధాంతరంగా తొలగించడం, ఉద్యోగుల క్వైట్ క్విట్టింగ్, మూన్లైటింగ్ సాధారణంగా మారుతున్న నేపథ్యంలో పనిప్రదేశాల్లో విధానాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే మూన్లైటింగ్ నేపథ్యంలో పన్ను ఎలా వర్తిస్తుందనే అంశంపై మరింత స్పష్టత తీసుకురావాలి. మరోవైపు కంపెనీలు ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సామాజిక భద్రత ఉండేలా.. కంపెనీలకు స్పష్టమైన విధానాలను ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంది.
చిన్న కంపెనీలకు ప్రాధాన్యం..
దేశంలో ఉద్యోగ కల్పనలో తక్కువ మూలధనంతో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో మూడో వంతు వాటా వీటిదే. ఉద్యమ్ పోర్టల్లోని వివరాల ప్రకారం.. 2021- 22లో ఎంఎస్ఎంఈల్లో 93,94,957 మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది అసంఘటిత రంగంలో ఉన్నవాళ్లే. ఈ నేపథ్యంలో ఎన్పీఎస్ వంటి పింఛను పథకాలతో పాటు ఇతర ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ వంటి సామాజిక భద్రత వ్యవస్థలను వీరికి వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ కల్పనను మరింత ప్రోత్సహించేలా ఎంఎస్ఎంఈలకు సైతం మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
నైపుణ్యానికి ప్రోత్సాహం..
భారత్లో నిరుద్యోగానికి గల ప్రధాన కారణాల్లో నైపుణ్యలేమి ఒకటి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఉద్యోగులు, అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ట్రైనింగ్ కోర్సులు, లెర్నింగ్ సబ్స్క్రిప్షన్లను పన్ను మినహాయింపుల పరిధిలోకి తీసుకురావాలి.
పన్నుల్లో ఊరట..
ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వేతనజీవులే సింహభాగం. 2022లో ఐటీఆర్ దాఖలు చేసిన వారిలో 50 శాతం మంది ఉద్యోగులే. ఈ నేపథ్యంలో కనీస పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని వేతన జీవులు కోరుతున్నారు. తద్వారా చిరుద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం సైతం ఎగబాకుతుంది. మరోవైపు గృహరుణంపై ఉన్న పన్ను మినహాయింపుల పరిమితి సైతం పెంచితే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను విషయంలో ఏకీకృత విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫలితంగా ఉద్యోగుల పొదుపులు పెరిగి పెట్టుబడులు సైతం ఎగబాకే అవకాశం ఉంటుంది.
పిల్లల సంరక్షణ ఖర్చులకు మినహాయింపులు..
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల పోషణ కష్టతరంగా మారింది. ముఖ్యంగా విద్య, వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ ఖర్చులకు కూడా పన్ను మినహాయింపు వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బీమా ప్రీమియంల తరహాలోనే వీటికి కూడా పన్ను రాయితీలు ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం విద్యా అలవెన్సు కింద తొలి బిడ్డపై నెలకు రూ.100, రెండో చైల్డ్పై నెలకు రూ. 300 వరకు మినహాయింపునిస్తున్నారు. దీన్ని మరింత పెంచడంతో పాటు ఇతర ప్రధాన ఖర్చులకు కూడా వర్తింపజేయడం ద్వారా ఉద్యోగులకు ఊరట కల్పించొచ్చు.
కార్మిక చట్టాలపై క్లారిటీ..
కార్మిక చట్టాల అమలు విషయంలో ఈ ఏడాది విస్తృతంగా చర్చ జరిగింది. ఉద్యోగుల పనివేళలు, పని గంటలు, వేతనాలు, సెలవులపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఓ స్పష్టతనిచ్చి.. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇటు ఉద్యోగులతో పాటు అటు కంపెనీలకు కూడా చట్టాలు ప్రయోజనకరంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
బడ్జెట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్.. తన కంపెనీలో పని చేస్తున్న సగానికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్