UK Economic Crisis: బ్రిటన్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. సంక్షోభం ఎక్కడ మొదలైంది?
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. లిజ్ ట్రస్ రాజీనామాతో అది తారస్థాయికి చేరినట్లు అర్థమవుతోంది.
‘‘నా విధానాలకు అందరూ మద్దతుగా నిలవకపోవచ్చు. కానీ, వాటి వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. దేశ ఆర్థికాభివృద్ధే నా ఏకైక ప్రాధాన్యం. ఈ సమయంలో పన్నుకోత నైతికంగానేగాక ఆర్థికంగానూ సరైన నిర్ణయం. తిరిగి మనం పూర్వవైభవం సంతరించుకుంటామన్నది సుస్పష్టం’’ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ (Liz truss) చేసిన తొలి ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు.
‘‘మేం తప్పులు చేశామని గుర్తించాం. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే వాటిని సరిచేసుకున్నాను. ఆర్థిక స్థిరత్వ చర్యలను పునరుద్ధరించాం. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం’’ మినీ బడ్జెట్ వైఫల్యం తర్వాత ట్రస్ (Liz truss) చేసిన వ్యాఖ్యలివి.
‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాను. అందుకే వైదొలగుతున్నాను’’ చివరగా తన రాజీనామాను ప్రకటిస్తూ ట్రస్ (Liz truss) చెప్పిన మాటలు.
ఇదంతా కేవలం 44 రోజుల్లోనే జరిగిపోయింది. దీన్ని బట్టి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఎంతటి సంక్షోభం (UK Economic Crisis)లో ఉందో చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన నెలన్నర వ్యవధిలోనే హామీలను నెరవేర్చలేనని ప్రధానే స్వయంగా అంగీకరించారంటే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి గందరగోళం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరిస్థితికి చేరుకోవడానికి దారి తీసిన కారణాలేంటి?
2008 నాటి ఆర్థిక సంక్షోభం..
గత 500 ఏళ్లలో యునైటెడ్ కింగ్డమ్ స్థిరత్వానికి పెట్టని కోటగా నిలిచింది. ప్రపంచ యుద్ధాలు, ప్రపంచ వ్యాప్తంగా దేశాలను కాలనీలుగా మార్చడం, మహమ్మారులు, అంటువ్యాధులు.. ఇలా అనేక సంక్షోభ సమయాల్లో కూడా లండన్ పునాదులు పటిష్ఠంగా నిలిచాయి. ఇది అంతర్జాతీయ బ్యాంక్లను ఆకర్షించింది. హెచ్ఎస్బీసీ, బార్క్లేస్, స్టాండర్డ్ ఛార్టర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యలయాలన్నీ అక్కడే కొలువుదీరాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇవన్నీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచాలని భావించింది. ఉదాహరణకు.. గృహరుణ రేట్లను 6.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. కొన్ని నెలల క్రితం వడ్డీరేట్లు 1.25 శాతం వరకు పడిపోయాయి. దీంతో వ్యవస్థలో ద్రవ్యలభ్యత ఎక్కువై ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా ద్రవ్యోల్బణానికి దారితీసే పరిస్థితులు తలెత్తాయి. తిరిగి దీనికి పరిష్కారంగా యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా కొవిడ్-19 సంక్షోభం తర్వాత రుణరేట్లను 14 ఏళ్ల గరిష్ఠానికి చేర్చింది. దీంతో రుణాలు తీసుకున్న కుటుంబాలు తమ ఆదాయంలో దాదాపు మూడోవంతు వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
బ్రెగ్జిట్..
ఒకప్పుడు ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అనేక వాణిజ్య రాయితీలు, ప్రోత్సాహకాలు ఉండేవి. మరోవైపు, ఒకదేశ వృద్ధికి నైపుణ్యం ఉన్న మానవ వనరులు చాలా ముఖ్యం. బ్రెగ్జిట్కు ముందు ఐరోపా దేశాల్లోని చాలా మంది నిపుణులు యూకేకు వెళ్లి స్వేచ్ఛగా పనిచేసుకునేవారు. కానీ, బ్రెగ్జిట్ తర్వాత వారి రాక నిలిచిపోయింది. ఐరోపా మార్కెట్ను కోల్పోతామనే భయంతో కొన్ని కంపెనీలు బ్రిటన్ను వదిలి వెళ్లిపోయాయి. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగి.. ద్రవ్యోల్బణానికి దారితీసిన కారణాల్లో ఇదొకటిగా నిలిచింది. అదే సమయంలో కరోనా విరుచుకుపడడంతో యూకే ఆర్థిక వ్యవస్థ ‘స్టాగ్ఫ్లేషన్’ దశకు చేరుకుంది. (అంటే నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వృద్ధి ఆగిపోవడం, ద్రవ్యోల్బణం ఎగబాకడం)
కొత్త ప్రభుత్వం..
బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి ముందే బ్రిటన్ ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఆయన తర్వాత వచ్చిన లిజ్ ట్రస్ చేపట్టిన పన్ను సంస్కరణలు, వ్యాపారాలపై నియంత్రణలను తగ్గించడం వంటి ప్రయోగాలు బెడిసికొట్టాయి. ధనవంతులపై ఉన్న 45 శాతం పన్నును గణనీయంగా తగ్గించారు. కార్పొరేట్ పన్నును వచ్చే ఏడాది నుంచి 25 శాతం నుంచి 19 శాతం మధ్యలోకి కుదిస్తానని చెప్పారు. ఇది ప్రజల ఆగ్రహానికి దారి తీసింది. పన్ను కోతల్ని అమలు చేస్తే ఆదాయం తగ్గి.. ప్రభుత్వం కొత్తగా అప్పులు తేవాల్సి ఉంటుంది. పైగా నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోనున్నారనే అంశంపై ట్రస్ స్పష్టమైన వివరాలేమీ వెల్లడించలేదు. ఈ నిర్ణయాలు వివాదం కావడంతో లిజ్ ట్రస్ మాటమార్చారు. ఆర్థిక మంత్రిపైకి తప్పును తోసి పదవి నుంచి తొలగించారు. ధనవంతులపై 45 శాతం పన్ను, కార్పొరేట్ పన్ను 25 శాతంగా కొనసాగుతుందని ప్రకటించారు.
ప్రస్తుతం ఇదీ పరిస్థితి..
స్థిరత్వమే బ్రిటన్ ప్రధాన బలంగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అదే ప్రమాదంలో పడింది. దీంతో మదుపర్లు పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా కరెన్సీ విలువ భారీగా పతనమైంది. దేశ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సైతం బ్రిటన్ను హెచ్చరించింది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం బ్రిటన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం 9.90 శాతంగా నమోదై 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. విద్యుత్తు బిల్లులు 100 శాతానికి పైగా పెరిగాయి. పౌండ్ విలువ ఇటీవలి కాలంలో 24 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. ఇదే సమయంలో శీతాకాలం రావడంతో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ధరలు అమాంతం పైకెగశాయి. అయితే, రష్యా నుంచి గ్యాస్, చమురు సరఫరా నిలిచిపోవడంతో విద్యుదుత్పత్తి ఖర్చు పెరిగి కంపెనీల నష్టాలు భారీగా పెరిగాయి. దీంతో తాజా బడ్జెట్లో విద్యుత్తు ధరల పరిమితిని ఒక్కో మెగావాట్ హవర్పై (MWH) 520 పౌండ్లకు పెంచారు. పైగా పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే ధరను నిర్ణయించారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురవడంతో ట్రస్ వైదొలగక తప్పలేదు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?