Quiet quitting: క్వైట్ క్విట్టింగ్.. ఉద్యోగుల్లో ఏంటీ కొత్త ట్రెండ్?
Quiet quitting: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్వైట్ క్విట్టింగ్ అనే పదం బాగా వినిపిస్తోంది. చాలా మంది ఉద్యోగులు కేవలం తమ పాత్రకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఏమాత్రం అదనపు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.....
Quiet quitting: కొవిడ్-19 వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన అభిరుచులనూ మార్చింది. 2021 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 2022 మధ్య ఒక్క అమెరికాలోనే దాదాపు 7.16 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ప్రపంచవ్యాప్తంగానూ ఈ ట్రెండ్ కనిపించింది. దీన్నే ‘గ్రేట్ రెసిగ్నేషన్’గా వ్యవహరించారు. అయితే, ఇలా ఉద్యోగాలు మారడమే కాదు.. తమ పనిభారాన్ని కూడా తగ్గించుకుంటున్నారు ఉద్యోగులు . దీన్నే ఇప్పుడు ‘క్వైట్ క్విట్టింగ్ (Quiet quitting)’గా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ పదంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, భారత్లో మాత్రం ఈ పోకడ తక్కువగానే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
క్వైట్ క్విట్టింగ్ అంటే..
పదం సూచిస్తున్నట్లుగా.. నెమ్మదిగా ఉద్యోగం నుంచి జారుకోవడం అని దీని అర్థం కాదు. పనిభారాన్ని తగ్గించుకొని.. కేవలం వారి పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగానే ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వ్యక్తిగత లక్ష్యాల కోసం కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి మరీ పనిచేసేవారు. కానీ, ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ.. ఎక్కడా అదనపు బాధ్యతల్ని తమ భుజాన వేసుకోవడానికి కార్పొరేట్ ఉద్యోగులు ఇష్టపడడం లేదని నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఉద్యోగులు తమ బాధ్యతలను మాత్రం మరవడం లేదు. పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. కానీ, ‘ఉద్యోగమే జీవితం’ అనే సూత్రాన్ని మాత్రం అంగీకరించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కొత్తా?
క్వైట్ క్విట్టింగ్ (Quiet quitting) అనే పదం మాత్రమే కొత్తది. ఈ విధానం మాత్రం ఎప్పటి నుంచో ఉంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. కానీ, ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం టిక్ టాక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు.
ఎందుకు ఈ పరిస్థితి?
క్వైట్ క్విట్టింగ్ (Quiet quitting)కు చాలా కారణాలున్నాయి. ఉద్యోగంలో అసంతృప్తి, ధరలు పెరిగినప్పటికీ.. ఇంకా తక్కువ వేతనాలు ఇవ్వడం, సరైన గుర్తింపు లేకపోవడం, మెరుగైన భవిష్యత్తుకు సరైన అవకాశాలు లేకపోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం.. వంటివి క్వైట్ క్విట్టింగ్కు ప్రధాన కారణాలని కార్పొరేట్ ఉద్యోగులు పలు సర్వేల్లో వెల్లడించారు. ఉద్యోగంలో తమ పాత్రకు మించి పనిచేసినా.. సరైన గుర్తింపు లేకపోవడం వల్ల పనిపై ఉద్యోగులకు శ్రద్ధ తగ్గుతోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తమ కనీస పనిని పూర్తి చేయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ ప్రభావం..
కొవిడ్ సంక్షోభంలో చాలా మంది ఇంటి నుంచి పనిచేశారు. ఇది చాలా మంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. మరికొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించాయి. మరోవైపు ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో చాలా కంపెనీలు తిరిగి కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. అయితే, ఉద్యోగులను మాత్రం ఇంకా మహమ్మారి భయాలు వీడలేదు. ఒకసారి కొవిడ్ సోకడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులకు తమ పనిపై ఆసక్తి తగ్గింది. ఇంత కష్టపడితే కంపెనీలు ఇస్తున్న ప్రయోజనాలు అంతంతమాత్రమేనన్న అభిప్రాయం బలపడింది. ఇదే క్వైట్ క్విట్టింగ్కు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి టిక్టాక్ సహా సామాజిక మాధ్యమాలు జత కావడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కేవలం ఉద్యోగంలో తమ పాత్ర ఎంత వరకో.. అక్కడికి మాత్రమే పరిమితం కావాలన్న వాదనకు టిక్టాక్ సహా ఇతర వేదికలపై యువ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
ఎలా గుర్తించడం?
ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గడం, ఉత్పాదకత పడిపోవడం, ఎక్కువ పనిగంటలు చేయడానికి విముఖత, అదనపు భత్యాలు లేకపోతే.. ఇతర బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించడం, ఇతరుల స్థానంలో పనిచేయడానికి ఇష్టపడకపోవడం, పనిలో ఆలస్యంగా చేరడం, తొందరగా వెళ్లిపోవడం, ఈమెయిళ్లు, కాల్స్కు సరిగా స్పందించకపోవడం.. వంటి లక్షణాలు చాలా మంది ఉద్యోగుల్లో ఉంటే దాన్ని క్వైట్ క్విట్టింగ్గా కంపెనీలు గుర్తించవచ్చని నిపుణులు తెలిపారు. అయితే, ఈ లక్షణాలన్నీ కచ్చితంగా క్వైట్ క్విట్టింగ్గా భావించాల్సిన అవసరం లేదని.. కొందరు బద్ధకం వల్ల కూడా ఇలా చేస్తుంటారని తెలిపారు. పరిస్థితిని క్షుణ్నంగా అధ్యయనం చేయడం వల్ల కారణం తెలుసుకోవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?