Windfall Tax: విండ్ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి
పెట్రోలియం ముడిచమురుపై పర్సంటేజ్ ఆధారంగా కాకుండా ఉత్పత్తి చేస్తున్న టన్నుల ఆధారంగా విండ్ఫాల్ ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిక్కీ పేర్కొంది.
దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ (Windfall Tax)ను రద్దు చేయాలని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (FICCI) కేంద్రాన్ని కోరింది. ఇది చమురు సంస్థల లాభాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపింది. ఈ మేరకు పరిశ్రమల తరపున బడ్జెట్కు సంబంధించి సమర్పించే సిఫార్సులలో విండ్ఫాల్ ట్యాక్స్ రద్దు అంశాన్ని చేర్చినట్లు ఫిక్కీ వెల్లడించింది. దేశీయ చమురు సంస్థలు పొందుతున్న అదనపు లాభాలను ఆదాయంగా మార్చుకునేందుకు కేంద్రం గతేడాది జవనరి 1 నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ను వసూలు చేస్తోంది. అప్పట్లో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై టన్నుకు రూ.23, 250 వసూలు చేసింది. ఈ పన్ను వసూలుతో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు విమాన ఇంధనం (ATF) ధరలు తగ్గాయి. తాజాగా ఈ నెలలో దాన్ని రూ.17,000కు తగ్గించింది.
‘‘పెట్రోలియం ముడిచమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)ని రద్దు చేయాలి. ఒకవేళ తప్పనిసరిగా పన్ను వసూలు చేయాలని భావిస్తే ప్రస్తుతం ఉన్నదానికంటే 20 శాతం తగ్గించాలి. పర్సంటేజ్ ఆధారంగా కాకుండా ఉత్పత్తి చేస్తున్న టన్నుల ఆధారంగా విండ్ఫాల్ ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని ఫిక్కీ పేర్కొంది.
‘‘ ప్రస్తుతం దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న సంస్థల నుంచి 70 శాతం వరకు పన్ను వసూలు చేస్తున్నారు. కానీ, ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 35 నుంచి 40 శాతం పన్ను వసూలు మాత్రమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు బడ్జెట్ సరైన సమయం’’ అని వేదాంత లిమిటెడ్ సీఈవో సునీల్ దుగ్గల్ అన్నారు.
ఏడాది రెండు మిలియన్ బ్యారెల్ల కన్నా తక్కువ ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు విండ్ఫాల్ ట్యాక్స్ నుంచి కేంద్రం మినహాయింపును ఇచ్చింది. ఇంధన రంగానికి మద్దతుగా, ప్రపంచ ముడిచమురు మార్కెట్ల నుంచి దేశీయ సంస్థలకు రక్షణ కల్పించేందుకు విండ్ఫాల్ ట్యాక్స్పై విధానపరమై సంస్కరణలు అమలు చేయడాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని దేశీయ ముడిచమురు ఉత్పత్తి సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM