పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..

ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అర్హులు 

Published : 18 Dec 2020 18:01 IST

పన్ను రాయితీని కల్పించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్థిర ఆదాయంతో పాటు, పన్ను మినహాయింపు పొందాలనుకునే వారికి అనుకూలమైనవి.  ఈ పథకంలో పెట్టుబడులు పూర్తి సురక్షితం. ఈ ర‌క‌మైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన‌వారికి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్ 80సీ కింద రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మినహాయింపు వ‌ర్తిస్తుంది.

ముఖ్యమైన లక్షణాలు:

  • పాన్‌కార్డు కలిగి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు పన్ను రాయితీతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అర్హులు.
  • పెట్టుబడులను ఒకరిపేరు మీద లేదా ఉమ్మడిగా చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో మొదటి వ్యక్తి ఆదాయానికి మాత్రమే పన్ను రాయితీ ఉంటుంది.
  • ఈ డిపాజిట్ల కాలపరిమితి 5 ఏళ్లు.
  • కనీస డిపాజిట్‌ విలువ రూ.100 ఆ పై గుణాంకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు.
  • గరిష్ఠ డిపాజిట్‌ విలువ రూ.1.5లక్షలు.
  • పెట్టుబడి పెట్టే తేదీకి ఉన్న వడ్డీరేటును 5 ఏళ్ల కాలానికి అమలుచేస్తారు.
  • వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ లేదు.
  • ఈ పెట్టుబడులపై రుణసౌకర్యం ఉండదు.
  • ఈ డిపాజిట్‌ ఖాతాలను కాలపరిమితికి ముందుగా మూసివేసే అవకాసం లేదు.

పెట్టుబడిపై మినహాయింపు ఉన్నప్పటికీ మెచ్యూరీటి సమయానికి వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. మెచ్యూరిటీ నాటికి పెట్టుబడిదారు ఆదాయపు పన్ను శ్లాబు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ నికర రాబడి (పన్ను తర్వాత రాబడి) ఉంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి 8.5 శాతం వడ్డీ చెల్లించే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టి, అతని ఆదాయపు పన్ను 30.9 శాతం అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా అతని నికర రాబడి 5.87 శాతం మాత్రమే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు