Wheat export ban: సింగపూర్ పంజాబీలకు చపాతీ కష్టాలు!
గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం విధించిన నిషేధం నేపథ్యంలో సింగపూర్లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....
సింగపూర్: గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో సింగపూర్లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పంజాబీలు ఎక్కువగా ఉత్తర భారత దేశ గోధుమ పిండిని వినియోగిస్తుంటారు. అదే రకం గోధుమల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఖర్చు మూడింతలవుతోంది.
ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. దీంతో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా దేశీయంగా సరఫరా తగ్గింది. ఇది ధరల పెరుగుదలకు దారి తీసింది. దీన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై మే నెలలో నిషేధం విధించింది. దీంతో అప్పటి వరకు మన గోధుమ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకున్న సింగపూర్ సూపర్మార్కెట్ చైన్ ఫెయిర్ప్రైస్కు సరఫరా తగ్గిపోయింది. ఈ సంస్థకు శ్రీలంక, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏ నుంచి కూడా గోధుమ పిండి దిగుమతి అవుతోంది. అయితే, ధర మాత్రం భారత్తో పోలిస్తే మూడింతలు అధికంగా ఉండడంతో వినియోగదారులపైకి ఆ భారాన్ని మోపడం కష్టంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సింగపూర్ రెస్టారెంట్లు కిలో భారత గోధుమ పిండికి 5 సింగపూర్ డాలర్లు చెల్లించేవి. ఇప్పుడు దుబాయ్ మీదుగా వస్తున్న పిండి కోసం 15 సింగపూర్ డాలర్లు చెల్లించాల్సి వస్తోందని అక్కడి రెస్టారెంట్ యజమానులు తెలిపారు. ఐరాస గణాంకాల ప్రకారం.. సింగపూర్ 2-2.5 లక్షల టన్నుల గోధుమల్ని, 1-1.2 లక్షల టన్నుల గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటోంది. దీంట్లో 5.8 శాతం భారత్ నుంచి ఎగుమతి అయ్యేది. మన దేశ వాటా చాలా తక్కువే అయినప్పటికీ.. అక్కడి భారతీయ రెస్టారెంట్లు మాత్రం మన పిండినే ఎక్కువగా వినియోగించేవి. తాజా కొరత నేపథ్యంలో అక్కడి కొన్ని రెస్టారెంట్లు చపాతీ, పూరీ భాజీ, తందూరి వంటి వంటకాల తయారీని నిలిపివేశాయి. దీంతో సింగపూర్లో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంజాబీలు, ఉత్తరాదివారిపై ప్రభావం ఎక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?