EPF: ఈపీఎఫ్ నామినేషన్ దాఖలు చేశారా? లేదంటే ఇలా చేసేయండి..
ఉద్యోగి భవిష్య నిధి(ఈపీఎఫ్) సభ్యులు తమ కుటుంబం సంక్షేమం కోసం ఈ- నామినేషన్ దాఖలు చేయడం తప్పనిసరి.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యులు తమ కుటుంబం సంక్షేమం కోసం ఈ- నామినేషన్ దాఖలు చేయడం తప్పనిసరి. ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్ (EPS), బీమా (EDLI) వంటి పలు ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అందిస్తోంది. ఉద్యోగి మరణానంతరం సంస్థ ఇచ్చే సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా కుటుంబ సభ్యలకు అందజేసేందుకు ఈ - నామినేషన్ సాయపడుతుంది. ఇంతకు ముందులా నామినేషన్ దాఖలు కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన పనిలేదు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా కాగిత రహితంగా ఈ- నామినేషన్ దాఖలు చేయవచ్చు.
ఈ- నామినేషన్ను దాఖలు చేసేందుకు ఉద్యోగులు తమ యూఏఎన్ నంబరును.. ఈపీఎఫ్ పోర్టల్లో యాక్టివేట్ చేసుకుని ఉండాలి. దీంతో పాటు సంస్థ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/ జీవిత భాగస్వామి పేరు వంటి పలు వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించుకోవచ్చు. అయితే ప్రతి నామినీకి సంబంధించిన కేవైసీ వివరాలను అందించాలి. దీంతో పాటు పీఎఫ్/ఈడీఎల్ఐలో నామినీల వాటా (100 శాతంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది)ను తెలియజేయాలి. కుటుంబ సభ్యులు లేని వారు వారికి కావాల్సిన వారిని ఎవరినైనా నామినీలుగా ఎంచుకోవచ్చు. అయితే భవిష్యత్తులో కుటుంబ సభ్యుడు వస్తే ఈ- నామినీ చెల్లదు.
ఆన్లైన్లో ఈపీఎఫ్/ ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేసే విధానం
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సెట్కు వెళ్లి, అక్కడ ‘సర్వీసెస్’ ఆప్షన్లో ‘ఫర్ ఎంప్లాయిస్’ సెక్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ కింది భాగంలో ఎడమ వైపున ఉన్న సర్వీసెస్ ఆప్షన్ కింద కనిపిస్తున్న ‘మెంబర్ యూఏఎన్/ ఆన్లైన్ సర్వీస్’ పై క్లిక్ చేయాలి.
- మెంబర్ ఇ-సేవా పోర్టల్కు పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ్ మీ యూఎఎన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
- డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న మ్యానేజ్ ట్యాబ్పై క్లిక్ చేసి ‘ఇ-నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలి.
- కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్ చేయాలి. ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్ చేయవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడే తెలపాలి. ఒకసారి వివరాలన్నింటినీ సరి చూసుకుని ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయాలి.
- తర్వాత పేజ్కు వెళ్లి ఇ-సైన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్కు అనుసంధానించిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
- ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కింద జీవిత బీమా ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. కనీస బీమాను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు.. గరిష్ఠ బీమా పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఈ - నామినేషన్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి