Budget 2023: ఇక ‘పాన్’ ఒక్కటే చాలు..!
Budget 2023: ఈ సారి బడ్జెట్లో వ్యాపారాలన్ని మరింత సులువు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపార సంస్థలు 10కిపైగా ఐడీ కార్డులను ఉపయోగించాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది.
ఇంటర్నెట్డెస్క్: దేశంలో వాణిజ్య వాతావరణాన్ని (Ease of doing business) మరింత మెరుగు పర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నిబంధనల చట్రాల్లో కొంత వెసులుబాటును తీసుకొచ్చింది. పదికి పైగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాల్సిన ఇబ్బంది నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి లభించింది. దీంతోపాటు గత డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టిన ‘జన్ విశ్వాస్’ బిల్లుకు (Jana vishwas bill) అనుగుణంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ బిల్లు జాయింటు పార్లమెంటరీ కమిటీ ఎదుట ఉంది. భారత్లో వ్యాపారం చేయాలంటే వివిధ రకాల చట్టాల కింద ఉండే వేల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల చిన్న నిబంధనలు ఉల్లంఘించినా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను భయపెడుతోంది. ఇవి పెట్టుబడులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. దేశంలో సంస్కరణలు జరిగే కొద్దీ ఇటువంటి నిబంధనలను తొలగించి వ్యాపారాలను ప్రభుత్వాలు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. తాజాగా బడ్జెట్ 2023లో (Budget 2023) దాదాపు 39,000 నిబంధనలను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) ప్రకటించారు. అంతేకాదు.. 3,400 రకాల చిన్నచిన్న ఉల్లంఘనలను డీక్రిమినలైజ్ చేశారు. అంటే ఆ నేరాలకు జైలు శిక్షలు కాకుండా అపరాధ రుసుము వంటి చర్యలతో సరిపెడతారు.
13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు బదులు పాన్ (PAN) ఒక్కటే..
వ్యాపారాలకు ఇక నుంచి PAN కార్డ్ అత్యంత ముఖ్యమైనదిగా మారిపోనుంది. ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని పలు రకాల డిజిటల్ వ్యవస్థలు ఇక PAN కార్డును గుర్తింపు కార్డుగా స్వీకరించనున్నాయి. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు EPFO, ESIC, GSTN, TIN, TAN, PAN వంటి వాటిని చూపి అనుమతుల తెచ్చుకొంటున్నాయి. కానీ, ఇక నుంచి PAN ఒక్కదానినే అంగీకరిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది ఒక అడుగని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఏమిటీ జన విశ్వాస్ బిల్లు..
కేంద్రం మొత్తం 42 చట్టాల్లోని నిబంధనలను తొలగించి వ్యాపారాలను మరింత సరళంగా మార్చాలని ఈ బిల్లులో నిర్ణయించారు. దీని ప్రకారం పోస్టాఫీస్ చట్టం-1898, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, పబ్లిక్ లైబిలిటీ ఇన్స్యూరెన్స్ చట్టం-1991, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 వంటివి వీటిల్లో ఉన్నాయి. ఈ చట్టాల్లో ఉన్న కొన్నిరకాల నేరాలకు జైలుశిక్ష వరకు విధిస్తారు. అటువంటి వాటిని నేరాల జాబితా నుంచి తప్పించి అపరాధ రుసుంతో సరిపెట్టనున్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ (గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్) యాక్ట్-1937 కింద నకిలీ గ్రేడింగ్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 ఫైన్ విధిస్తారు. కానీ, కొత్త బిల్లు ప్రకారం అదే నేరానికి రూ.8 లక్షల ఫైన్ విధిస్తారు.
కంపెనీల చట్టం-2013 కింద ఉన్న చిన్నచిన్న ఆర్థిక నేరాలను డీక్రిమినలైజ్ చేస్తే.. 4,00,000 కంపెనీలు తాము పాల్పడిన నిబంధనల ఉల్లంఘనలను సరిచేసుకోవడానికి సానుకూలంగా ఉన్నాయని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది. ఈ క్రమంలోనే 3,400 నేరాలను డీక్రిమినలైజ్ చేసింది.
స్టార్టప్ల కోసం సరికొత్త డేటా గవర్నెన్స్పాలసీ..
స్టార్టప్లు, విద్యాసంస్థల్లో సృజనాత్మక-పరిశోధనలను ప్రోత్సహించేలా కీలక డేటాను వాడుకొనేందుకు వీలుగా నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీని ప్రభుత్వం తీసుకురానున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 2022లో ఐటీ శాఖ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ(ఎన్డీజీఎప్పీ) ముసాయిదాను జారీ చేసింది. దీని ప్రకారం స్టార్టప్లు, పరిశోధనల కోసం భారత్కు సంబంధించిన వ్యక్తిగతేతర డేటా నిధిని ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తుంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఐ) ప్రతి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఏఐఎంఐకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు డేటా దొరకడం. ఏదైనా ఒక ఆల్గారిథమ్ను పరీక్షించాలన్నా భారీ స్థాయిలో డేటా అవసరం.
వివాద్ సే విశ్వాస్..
ఈ సారి బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల కాంట్రాక్ట్ వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను, వడ్డీ, జరిమానా, ఫీజుల అంశంలో వివాదాలను పరిష్కరించేందుకు దీనిని తీసుకొచ్చారు. నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు ఆశాదీపం వలే ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
Resume Tips: రెజ్యూమె ప్రిపేర్ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..