Foxconn: ఏప్రిల్ నుంచి కర్ణాటక కొత్త ప్లాంట్లో ఐఫోన్ల తయారీ: మంత్రి పాటిల్
Foxconn: బెంగళూరు సమీపంలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయని మంత్రి పాటిల్ తెలిపారు. కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
బెంగళూరు: టెక్ దిగ్గజం యాపిల్ (Apple)కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్కాన్ (Foxconn) వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల (iPhones) తయారీని చేపట్టబోతోందని మంత్రి ఎం.బి.పాటిల్ తెలిపారు. దేహణహళ్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన తయారీ యూనిట్లో 2024 ఏప్రిల్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. ఫాక్స్కాన్ (Foxconn) ప్రతినిధులతో గురువారం భేటీ అయిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా పాల్గొన్నారు.
రూ.13,600 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేసినట్లు కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. దేవణహళ్లిలోని ఐటీఐఆర్ (Information Technology Investment Region) ప్రాంతంలోని 300 ఎకరాల స్థలాన్ని 2023 జులై 1 నాటికి ఫాక్స్కాన్ (Foxconn)కు అప్పజెబుతామని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, రోడ్లు సహా ఇతర మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
కంపెనీలో పనిచేయడానికి ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యాలు ఏమిటో కూడా తెలియజేయాలని ఫాక్స్కాన్ (Foxconn)ను కోరినట్లు పాటిల్ తెలిపారు. తద్వారా ఆయా నైపుణ్యాలపై శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థలానికి చెల్లించాల్సిన ధరలో 30 శాతం ఇప్పటికే ప్రభుత్వానికి కంపెనీ చెల్లించినట్లు అధికారిక ప్రకటన తెలియజేసింది. మూడు దశల్లో ఈ ప్రాజెక్టును ఫాక్స్కాన్ (Foxconn) పూర్తిచేయనుంది. అన్ని దశలు పూర్తయితే, ఏటా ఈ ప్లాంట్ నుంచి రెండు కోట్ల ఫోన్లు తయారవుతాయని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో రూ.17,622 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. -
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?