Apple AirPods: ఫాక్స్కాన్కు యాపిల్ ఎయిర్పాడ్ల కాంట్రాక్ట్.. తెలంగాణలోనే తయారీ?
అనుబంధ సంస్థ ‘ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ’ ద్వారా ఫాక్స్కాన్ తెలంగాణలో ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి నుంచే యాపిల్ ఎయిర్పాడ్లను తయారు చేయొచ్చని సమాచారం.
దిల్లీ: యాపిల్ ఎయిర్పాడ్ల (Apple Airpods) తయారీ కాంట్రాక్టును ఫాక్స్కాన్ (Foxconn) దక్కించుకున్నట్లు సమాచారం. ఐఫోన్లు సహా మరికొన్ని సెమీకండ్టర్లను మాత్రమే ఇప్పటి వరకు అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఎయిర్పాడ్లు (Apple Airpods) కూడా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ వార్తాసంస్థ రాయిటార్స్ పేర్కొంది.
ప్రస్తుతం ఎయిర్పాడ్లను చైనాకు చెందిన కంపెనీలు యాపిల్కు సరఫరా చేస్తున్నాయి. అయితే, చైనా నుంచి తయారీని ఇతర దేశాలకూ విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే తాజాగా ఫాక్స్కాన్కు ఈ ఒప్పందాన్ని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఫాక్స్కాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ సీఈఓ యాంగ్ లియూ ఇటీవల భారత్లో పర్యటించి ఆ విషయాన్ని ధ్రువీకరించారు. పర్యటనలో భాగంగా తెలంగాణనూ సందర్శించిన ఆయన ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజా ఎయిర్పాడ్ల తయారీ కేంద్రాన్ని తెలంగాణలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకోసం 200 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటార్స్ పేర్కొంది. దీనిపై ఫాక్స్కాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అనుబంధ సంస్థ ‘ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ’ ద్వారా ఫాక్స్కాన్ తెలంగాణలో ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉందని కంపెనీలోని ఓ ఉన్నతాధికారి తెలిపినట్లు రాయిటార్స్ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. 2024 ఆఖరు కల్లా తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. యాపిల్ సూచన మేరకే ఫాక్స్కాన్ భారత్లో ఎయిర్పాడ్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు కంపెనీ నుంచి రావాల్సి ఉంది.
తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో చెప్పినట్లుగా.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో తయారీకేంద్రం ఏర్పాటుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే