Bank Frauds: ప్రభుత్వరంగ బ్యాంకు మోసాల్లో 51% తగ్గుదల
నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గి రూ.40,295.25 కోట్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది....
దిల్లీ: నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గి రూ.40,295.25 కోట్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. 2021-22లో 12 పీఎస్బీల్లో కలిపి రూ.40,295.25 కోట్లు మోసానికి గురైనట్లు వెల్లడించింది. చంద్రశేఖర్ గౌర్ అనే సామాజిక కార్యకర్త ‘సమాచార హక్కు చట్టం’ కింద కోరిన సమాచారం మేరకు ఆర్బీఐ ఈ వివరాలను అందించింది.
అయితే సంఖ్యాపరంగా చూస్తే తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని ఆర్బీఐ అందించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2020-21లో 9,933 బ్యాంకు మోసం కేసులు నమోదుకాగా.. 2021-22లో ఆ సంఖ్య 7,940కి పడిపోయాయి. అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అన్ని విభాగాల్లో కలిపి 431 కేసుల్లో రూ.9,528.95 కోట్ల సొమ్ము మోసానికి గురైంది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 4,192 బ్యాంకు మోసాల్లో ఖాతాదారులు రూ.6,932.37 కోట్లు నష్టపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు