వరుసగా ఏడోరోజు పెరిగిన ఇంధన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో సోమవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి.

Published : 15 Feb 2021 09:18 IST

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో సోమవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది ఏడోరోజు కావడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 26పైసలు పెరిగి రూ.88.99గా నమోదైంది. లీటర్‌ డీజిల్‌పై 29పైసలు పెరిగి రూ.79.35 వద్ద నిలిచింది. 

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో రూ.95 మార్కును తాకాయి. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.46 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.35 గా ఉంది. ఇక హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర గరిష్ఠ స్థాయిలో నమోదైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.53 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.55 గా నమోదైంది. కాగా ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి. వెంటనే ఇంధన ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.   

ఇదీ చదవండి

సూచీలు స్తబ్దుగానే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని